News April 6, 2025
నక్కపల్లి: విద్యుదాఘాతంతో సజీవ దహనం

తెగిన విద్యుత్తు తీగపై అడుగేసిన ఓ రైతు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటన నక్కపల్లి మండలం జానకయ్యపేటలో శనివారం జరిగింది. పోలీసులకు రైతులు సమాచారం ఇచ్చారు. మృతుడు తాతబ్బాయి అని కుటుంబసభ్యులు గుర్తించడంతో ఎస్ఐ సన్నిబాబు కేసు నమోదు చేశారు.
Similar News
News November 25, 2025
మేయర్ స్రవంతి వైసీపీలో లేదు: కాకాణి

నెల్లూరు నగర మేయర్ అవిశ్వాస తీర్మానంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెడుతున్నట్లు టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ‘ఆమె మా పార్టీకి ఎప్పుడో రాజీనామ చేశారు. కానీ ఆమె మా పార్టీలో ఉన్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. అమాయక గిరిజన మహిళను గద్దె దించడానికి అధికార పార్టీ నాయకులు అవినీతి నిందలు వేయడం తగదు’ అని పేర్కొన్నారు.
News November 25, 2025
ధాన్యం కొనుగోలుపై ఫిర్యాదులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని ప.గో జాయింట్ కలెక్టర్ రాహుల్ సూచించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, రవాణా, తూకంలో సమస్యలుంటే 81216 76653, 1800 425 1291 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. కొనుగోళ్లకు రైతు సేవా కేంద్రాలను సిద్ధం చేశామని, రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
News November 25, 2025
జగిత్యాల: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ పెంపుపై కలెక్టర్ సమీక్ష

2025–26 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ల పెంపుపై కలెక్టర్ బి.సత్యప్రసాద్ మంగళవారం సమావేశం నిర్వహించారు. 5–8 ప్రభుత్వ, 9–10 ప్రభుత్వ–ప్రైవేట్ పాఠశాలల SC విద్యార్థులు tgepass.cgg.gov.inలో దరఖాస్తు చేయాలని సూచించారు. ఆధార్ సీడెడ్ బ్యాంక్ ఖాతాలు, కుల–ఆదాయం సర్టిఫికెట్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. ఇన్ఆపరేటివ్ ఖాతాలున్న వారికి పోస్టల్ అకౌంట్లు తెరిపించి 100% రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.


