News January 23, 2026
నగరిలో CM కాన్వాయ్ ట్రయల్ రన్

నగరిలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ శుక్రవారం నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి ట్రయల్ రన్ ప్రారంభమైంది. కీలక పాయింట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు, సేఫ్టీ జోన్లపై సిబ్బందికి స్పష్టత ఇచ్చారు. వాహనాల మధ్య తగిన గ్యాప్ ఉండేలా పరిమిత వేగంతో, క్రమశిక్షణతో ప్రయాణించాలని ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
Similar News
News February 14, 2026
పుంగనూరు: 6 వేల ఏళ్లనాటి శివలింగం

పుంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీఅగస్తీశ్వర స్వామి ఆలయంలో అగస్త్య మహాముని స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాచీన ఆలయం చోళుల కాలంలో నిర్మించబడి, శైవ సంప్రదాయానికి పేరు పొందింది. ఇక్కడ శివుడు అగస్తీశ్వరునిగా, పార్వతి దేవి మీనాక్షిగా పూజలందుకుంటారు. ఆలయంలోని శివలింగం 6 వేల సంవత్సరాల పురాతమైనదిగా ప్రజల నమ్మకం.
News February 14, 2026
చిత్తూరు: ఈ ఏడాది నీటి ఎద్దడి లేనట్లే.!

కృష్ణా జలాలతో ఈ ఏడాది జిల్లాలో నీటి ఎద్దడి తప్పింది. పుంగనూరు తంబళ్లపల్లె, మదనపల్లె, నియోజకవర్గాలలోని అన్ని చెవులకు, పలమనేరులో కొన్ని చెరువులకు హంద్రి-నీవా ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. తంబళ్లపల్లెలో రెండు, మదనపల్లెలో 4 చెవులకు నీటిని మళ్లించారు. పుంగనూరులో 2, పలమనేరులో కొంత మేర చెరువులకు PBC నుంచి నీటిని తరలిస్తారు. ఎక్కడన్నా నీటి సమస్య వస్తే ఎదుర్కొనుందేకు సిద్ధమని అధికారులు తెలిపారు.
News February 14, 2026
చిత్తూరు: నీరున్నా వృథాగా వాడితే ఇబ్బందులే.!

హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు కృష్ణా జలాలు చేరాయి. నీరు ఉంది కదా అని వృథాగా వాడితే భవిష్యతులో ఇబ్బందులు తప్పవని పలువురు వాపోతున్నారు. పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాళ్ల ద్వారా జిల్లాకు సరాసరి 4.5TMCల నీరు వస్తోంది. మార్చి ఆఖరు వరకు ఈ నీటి విడుదల కొనసాగనుంది. వర్షాలు, హంద్రీ-నీవా జలాలతో 80% చెరువులు నిండు కుండలా మారాయి. కుప్పంలో 92 చెరువులు పూర్తిగా, 14 పాక్షికంగా, పలమనేరులో మరో 54 చెరువులు నిండాయి.


