News March 30, 2025
నగల వ్యాపారులను మోసం చేసిన మహిళలు అరెస్ట్

ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో జ్యువెలర్స్ షాప్లో ఉత్తర భారత దేశానికి చెందిన ఇద్దరు మహిళలు నకిలీ వెండి చూపించి బంగారు డైమండ్ రింగ్, మరొక షాప్లో వెండి చెంబుతో ఉడాయించినట్లు యజమానులు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ద్వారక పోలీసులు సీసీ టీవీ ద్వారా దర్యాప్తు చేసి శనివారం నలుగురు మహిళలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి బంగారం, వెండిని స్వాధీనం చేసుకొని రిమాండ్కి తరిలించారు.
Similar News
News December 3, 2025
BREAKING విశాఖ: స్పా సెంటర్పై దాడి.. ఐదుగురు అరెస్ట్

గాజువాక 80 ఫీట్ల రోడ్డులోని ఓ స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఒక విటుడు, ఆర్గనైజరు, మేనేజర్, ఇద్దరు మహిళలను సిటీ టాస్క్ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని గాజువాక పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరిగినా సమాచారం ఇవ్వాలని టాస్క్ఫోర్స్ సీఐ అప్పలనాయుడు ప్రజలను కోరారు.
News December 3, 2025
అట్రాసిటీ కేసుల పరిష్కారంలో చొరవ చూపాలి: కలెక్టర్

SC, ST అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సాయం తీసుకొని త్వరగా ఫలితాలు వచ్చేలా చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం ఆయన సమీక్షించారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవచూపాలన్నారు.
News December 3, 2025
అట్రాసిటీ కేసుల పరిష్కారంలో చొరవ చూపాలి: కలెక్టర్

SC, ST అట్రాసిటీ కేసుల పరిష్కారంలో అధికారులు, పోలీసులు ప్రత్యేక చొరవ చూపాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సాయం తీసుకొని త్వరగా ఫలితాలు వచ్చేలా చేయాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ మీటింగు హాలులో బుధవారం ఆయన సమీక్షించారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవచూపాలన్నారు.


