News July 13, 2024

నడిగూడెం: తెల్లబల్లి గ్రామంలో 50 మంది డెంగ్యూ జ్వరం

image

నడిగూడెం మండలంలోని తెల్లబల్లి గ్రామంలో డెంగ్యూ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో సీజనల్ వ్యాధుల పట్ల సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో సుమారు 50 మందికి పైనే డెంగ్యూ జ్వరానికి గురై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాంతకంగా మారక ముందే అధికారులు వైద్య సిబ్బంది స్పందించి ప్రజలు డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Similar News

News January 6, 2026

NLG: తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

image

కారు, బొలెరో ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి వద్ద KDD-జడ్చర్ల రహదారిపై ఈ ఘటన జరిగింది. మృతుడు పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాలకి చెందిన మారుపాక గణేష్‌గా గుర్తించారు. గణేష్ అంగడిపేట ఎక్స్ రోడ్డులోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 6, 2026

NLG: ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్

image

ట్రాన్స్‌జెండర్ల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ‘ఉపాధి పునరావాస పథకాన్ని’ ప్రవేశపెట్టిందని జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి తెలిపారు. వ్యవసాయం, వ్యాపారం లేదా సేవా రంగాల్లో స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అర్హులైన వారు ఈ నెల 12వ తేదీలోపు జిల్లా సంక్షేమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా ట్రాన్స్ జెండర్లు గౌరవప్రదమైన జీవనం గడపవచ్చన్నారు.

News January 6, 2026

NLG: పురపోరు.. చిత్ర విచిత్రాలన్నో

image

నల్లగొండ మున్సిపాలిటీ అధికారులు ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. పట్టణం నడిబొడ్డున ఉన్న వార్డుల్లో సైతం ఓటర్ల పేర్లు భారీ సంఖ్యలో గల్లంతయ్యాయి. ఒక వార్డులోని ఓటర్లను మరో వార్డులోకి చేర్చారు. భౌగోళికంగా ఒక వార్డు మధ్యలోని కాలనీ ఓటర్లను ఆ వార్డు సరిహద్దును దాటి మరో వార్డులోకి మార్చారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో వందల ఓట్లు పక్క వార్డుల్లో కలిపారు.