News June 14, 2024
నడిపల్లిలో మహిళా హత్య కేసును చేధించిన పోలీసులు
డిచ్పల్లి మండలం నడిపల్లి శివారులోని చెరువులో ఈనెల 12న మృతిచెందిన పవర్ లలిత ది హత్యేనని డిచ్పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. లలిత భర్తతో గొడవపడి, నడిపల్లిలో గత కొన్ని ఏళ్లుగా జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో రాథోడ్ వినోద్ అనే వ్యక్తితో లలిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. లలితను ఎలాగైనా వదిలించుకోవాలని వినోద్ ఈనెల 12న నడిపల్లి శివారులోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్యచేశాడు.
Similar News
News October 5, 2024
కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు
కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
News October 5, 2024
NZB: ఆన్లైన్ బెట్టింగ్… ముగ్గురు ఆత్మహత్య!
ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన రంగననేని సురేష్, హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. దీంతో ఆ కుటుంబం అప్పులపాలైంది. వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మివేసినా అప్పు తీరకపోవడంతో ముగ్గురు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
News October 5, 2024
NZB: చిన్నారిపై దాడి చేసిన కుక్క
నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క శుక్రవారం దాడి చేసింది. కిరాణా షాపులో బిస్కెట్ కొనుగోలు చేసి వెళ్తున్న చిన్నారిని గాయపరిచింది. చిన్నారి చెంప, పెదవిపై గాయాలయ్యాయి. చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.