News August 13, 2024
నత్తనడకన హెచ్ఎండీఏ తరలింపు!

హెచ్ఎండీఏ తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే నగరంలో పలు చోట్ల ఉన్న హెచ్ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటకు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నెమ్మదిగా సాగుతున్న పనుల మూలంగా కేంద్రీకృతానికి జాప్యం జరగనుంది. పైగా ప్యాలస్లో ఇప్పటికీ కొనసాగుతున్న నిర్మాణ పనులతో తరలింపు ప్రక్రియ ఎప్పుడనేది ఇంకా స్పష్టత రావడంలేదు.
Similar News
News October 3, 2025
HYD: పెద్దనాన్న వేధింపుతో విద్యార్థిని సూసైడ్

సొంత పెద్దన్నాన అత్యాచార వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాలిలా.. కొంపల్లిలోని పోచమ్మ గడ్డలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరకగా పెద్దనాన్నే కాలయముడయ్యాడని తేలింది. పేట్బషీరాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News October 3, 2025
నాంపల్లి: నేడు దత్తన్న అలయ్.. బలయ్

నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్.. బలయ్ కార్యక్రమం భారీ ఎత్తున్న జరిగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎంలు, కేంద్ర మంత్రులు, సినీ రంగ ప్రముఖులు, వివిధ పార్టీల కీలక నేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి రావాలని అందరికీ ఆహ్వానం అందించారు.
News October 3, 2025
నేడు CM చేతుల మీదుగా ఫలక్నుమా ROB ప్రారంభం

పాతబస్తీ వాసులకు శుభవార్త. నేడు ఫలక్నుమా ROB CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభంకానుంది. రూ.52.03 కోట్లతో 360.0 మీటర్ల పొడవులో GHMC, SCR సంయుక్తంగా దీనిని నిర్మించింది. బర్కస్ నుంచి చార్మినార్ రూట్తో పాటు ఫలక్నుమాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ROB ఉపయోగపడుతుంది. ఉదయం 9:15 నిమిషాలకు CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్ఛార్జీ మంత్రులు, MP అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రారంభించనున్నారు.