News August 13, 2024
నత్తనడకన హెచ్ఎండీఏ తరలింపు!

హెచ్ఎండీఏ తరలింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే నగరంలో పలు చోట్ల ఉన్న హెచ్ఎండీఏ విభాగాలన్నింటినీ ఒకే చోటకు తరలించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నెమ్మదిగా సాగుతున్న పనుల మూలంగా కేంద్రీకృతానికి జాప్యం జరగనుంది. పైగా ప్యాలస్లో ఇప్పటికీ కొనసాగుతున్న నిర్మాణ పనులతో తరలింపు ప్రక్రియ ఎప్పుడనేది ఇంకా స్పష్టత రావడంలేదు.
Similar News
News November 14, 2025
HYD: 3ఏళ్లకే రికార్డులు కొల్లగొడుతున్న కార్తీక్ సూర్య

వనస్థలిపురంలోని IT ఉద్యోగి ప్రశాంత్, నీరజ కొడుకు కార్తీక్ సూర్య(3)కు 16 నెలల వరకు మాటే రాలే. 3 ఏళ్ల వయసులో అంకెలు గుర్తించి తల్లిని అడిగి తెలుసుకునేవాడు. వారి పెంపకంలో రోజుల వ్యవధిలోనే పెద్ద అంకెలతో కూడిక, తీసివేత, శాతాలు చేయడం మొదలెట్టాడు. కఠిన పదాలకు క్షణాల్లో నోటితోనే కచ్చితమైన సమాధానం చెప్తాడు. ఇండియా, నోబుల్, కిడ్స్, తెలంగాణ, తెలుగు, వరల్డ్ వైడ్, కలాం వరల్డ్ రికార్డులు సొంతం చేసుకున్నాడు.
News November 14, 2025
గచ్చిబౌలి స్టేడియంలో రెజోఫెస్ట్ 2025

రెజోనెన్స్ నిర్వహించిన రెజోఫెస్ట్ 2025 గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. 35 క్యాంపస్లకు చెందిన 7,000+ విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. డా. జైతీర్థ్ ఆర్. జోషి, నాగ్ అశ్విన్, శర్వానంద్, సుమా కనకాల వంటి ప్రముఖులు హాజరై విద్యార్థులకు స్ఫూర్తి, సృజనాత్మకత, లక్ష్య సాధన గురుంచి వివరించారు.
News November 14, 2025
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపుపై కూనంనేని హర్షం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ విజయం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. విజ్ఞతతో ఓటు వేసిన ఓటర్లకు ఆయన ధన్యావాదాలు తెలియజేశారు. స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గ పరిధి అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో BJP అభ్యర్థికి డిపాజిట్ గల్లంతయ్యిందన్నారు.


