News December 13, 2024
నదీ పుష్కరాలపై మంత్రి కొండా సమీక్ష

మంత్రి కొండా సురేఖ సారథ్యంలో ‘సరస్వతీ నది పుష్కరాల’పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో పుష్కరాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఎండి ప్రకాశ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
Similar News
News November 30, 2025
రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రేపు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ ఉండదని స్పష్టంచేశారు. జిల్లాలోని ప్రజలు ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.
News November 30, 2025
పర్వతగిరి: నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ పరిశీలన..!

స్థానిక సంస్థల ఎన్నికలకు చేపట్టిన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర బీసీ కమిషనర్ బాలమాయ దేవి పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ, నియమ నిబంధనలను పారదర్శకంగా చేపట్టాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. ప్రతి దశను నిష్పక్షపాతంగా చేపట్టాలన్నారు. ఇండస్ట్రియల్ జీఎం నరసింహమూర్తి ఎంపీడీవో శంకర్ పాల్గొన్నారు.
News November 30, 2025
వరంగల్: వైన్స్ బంద్.. ఇబ్బందుల్లో మందుబాబులు..!

మద్యం దుకాణాలకు నేటితో గడువు ముగుస్తున్నందున గత మూడు రోజులుగా దుకాణాలకు ప్రభుత్వం మద్యం సరఫరాను నిలిపివేసింది. కాగా, రేపటి నుంచి కొత్త షాపులు ప్రారంభం కానుండగా, అధికశాతం షాపులు పాత అడ్డాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. స్టాక్ లేకపోవడం, నూతన షాపుల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటుండటంతో జిల్లాలో వైన్ షాపులు బంద్ చేశారు. దీంతో మద్యం దొరకక మందుబాబులు విలవిల్లాడుతూ బెల్టు షాపులకు పరుగులు పెడుతున్నారు.


