News April 28, 2024
నన్ను గెలిపిస్తే ప్రజాసేవకుడిగా నిలిచిపోతా : రఘురాంరెడ్డి

ఆయోధ్యలో రామాలయం కట్టి బీజేపీ పార్టీ ఓట్లు అడుగుతోందని, తాము సైతం మరిపెడలో అతిపెద్ద రామాలయాన్ని నిర్మించామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. తనను దొర అని చెబుతున్న బీఆర్ఎస్ నాయకులు, మరిపెడ, చేగొమ్మలో తన ఆస్తులను ప్రజల అవసరాల కోసం ఇచ్చిన విషయాన్ని గుర్తించాలని సూచించారు. తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా నిలిచిపోతానని చెప్పారు.
Similar News
News November 12, 2025
వెలుగుమట్లలో సైనిక్ స్కూల్ అర్హతల పరిశీలన

ఖమ్మం జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలనలో భాగంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం పిపిపి మోడ్లో దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. ఖమ్మంలో దరఖాస్తు చేసిన ఈ పాఠశాల అర్హతను కమిటీ పరిశీలన ఆధారంగా నిర్ణయిస్తుందని అన్నారు.
News November 12, 2025
ఖమ్మం: దివ్యాంగుల పురస్కారాలకు దరఖాస్తులు ఆహ్వానం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల సాధికారిత రాష్ట్ర పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారి రాంగోపాల్రెడ్డి తెలిపారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఆన్లైన్లో ఉన్న దరఖాస్తు ఫారాలు, మార్గదర్శకాలను ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 20వ తేదీలోపు కార్యాలయంలో సమర్పించాలి.
News November 12, 2025
ఖమ్మం: బోనస్పై అనుమానం.. కొనుగోళ్లలో జాప్యం

ఖమ్మం జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. గతంలో విక్రయించిన ధాన్యానికి బోనస్ ఇంకా జమ కాకపోవడంతో రైతుల్లో గందరగోళం నెలకొంది. మద్దతు ధరతో పాటు బోనస్ రావాలంటే కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాల్సి ఉన్నా, బోనస్పై అనుమానంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడానికి మొగ్గు చూపుతున్నారు.


