News January 28, 2025

నన్ను చంపేస్తామంటున్నారు: ఆలపాటి

image

రాజకీయ నేత ఇంటిపై దాడి జరగడం ఏలూరు జిల్లాలో కలకలం రేపింది. పెదవేగి(M) ముండూరులోని కాంగ్రెస్ నేత ఆలపాటి నరసింహమూర్తి వాహనాలను ధ్వంసం చేశారు. ‘గత ఎన్నికల్లో నాకు మా ఊరి SCలు హెల్ప్ చేశారు. దీంతో వారిపై దాడి చేయడానికి YCP నాయకులు వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో మా ఇంటిపైకి వచ్చారు. నన్ను చంపేస్తామని మా భార్యకు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు నేను ఇంట్లో లేను’ అని ఆలపాటి చెప్పారు.

Similar News

News November 16, 2025

గద్వాల్ స్టేషన్‌లో ఆగే రైళ్లు ఇవే..!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రైల్వే స్టేషన్లలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను ఎంపీ డీకే అరుణ రైల్వే శాఖకు పంపించారు. గద్వాల రైల్వే స్టేషన్‌లో 17022 వాస్కో- హైదరాబాద్ 12976 మైసూర్- జైపూర్ రైళ్లను నిలిపే ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో గద్వాల్ నియోజకవర్గ ప్రజలు ఎంపీ అరుణమ్మకు ధన్యవాదాలు తెలిపారు. # SHARE IT

News November 16, 2025

రేపు తిరుచానూరుకు రాష్ట్ర మంత్రి రాక..

image

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 17వ తేదీన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 3 నుంచి 5 గంటల వరకు తిరుచానూరుకు చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.

News November 16, 2025

నరసరావుపేట: పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై సమీక్ష

image

అమరావతిలోని బుద్ధ విగ్రహాన్ని ఆధునికరించినట్లు కలెక్టర్ కృత్తిక శుక్లా తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం జిల్లాలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై ఆమె సమీక్షించారు. పర్యాటక ప్రాజెక్టు స్థితిగతులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. కోటప్పకొండ అభివృద్ధిపై డీపీఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. కొండవీడు వద్ద పర్యాటక భవనం నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాలని చెప్పారు.