News May 4, 2024
నరసన్నపేటకు రానున్న చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న జిల్లాకు రానున్నారు. ఆరోజు నరసన్నపేట నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొననున్నారు. విజయవాడ నుంచి 9న ఉదయం 11 గంటలకు నరసన్నపేట చేరుకుంటారని, అనంతరం చీపురుపల్లి వెళ్తారని ఆ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కలమట వెంకట రమణ తెలిపారు.
Similar News
News December 12, 2025
శ్రీకాకుళం జిల్లాలో తెరుచుకోని అంగన్వాడీ కేంద్రాలు

శ్రీకాకుళం జిల్లాలోని 3,385 అంగన్వాడీ కేంద్రాలు శుక్రవారం తెరుచుకోలేదు. తమ సమస్యలు పరిష్కారానికి అంగన్వాడీ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడంతో సిబ్బంది విధులను బహిష్కరించారు. ప్రధానంగా కనీస వేతనాలు, సంక్షేమ పథకాలు అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, FRS రద్దు తదితర ముఖ్యమైన సమస్యలు పరిష్కారం కోరుతూ ధర్నాలో పాల్గొనున్నారు.
News December 12, 2025
ఎచ్చెర్ల: యూనివర్సిటీలో జాతీయ సదస్సు

ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈనెల 18, 19 తేదీల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు బి.ఆర్.ఏ.యు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య గురువారం ఓ ప్రకటనలో విడుదల చేశారు. భారతదేశంలో విజ్ఞాన సమపార్జన, సంస్కృతి అనే అంశంపై ఈ సదస్సు నిర్వహిస్తామన్నారు. విద్యారంగ నిపుణులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని చెప్పారు.
News December 12, 2025
SKLM: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ప్రకటనలో తెలిపారు.ఇంధన పొదుపు ఆవశ్యకతను వినియోగదారులకు మరింత తెలిసేలా అవగాహన కల్పించేలా నిర్వహిస్తామన్నారు. ఈ వారోత్సవాలను శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ కేంద్రాల్లో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.


