News March 12, 2025

నరసన్నపేట: చిట్ ఫండ్ అధినేత కోరాడ గణేష్ ఆస్తుల జప్తు

image

నరసన్నపేటలోని ‘లక్ష్మీ గణేష్ చిట్స్’ సంస్థకు చెందిన కోరాడ గణేశ్వరరావు చరాస్తులను జప్తు చేస్తూ హోం శాఖ జీవో నెం. 46 ద్వారా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కోరాడ గణేశ్వరరావు డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి రూ.5.86 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నరసన్నపేట స్టేషన్‌లో 2021లో కేసు నమోదైంది. 5.86 కోట్లు వరకూ దోచుకోగా కేవలం చరాస్తులు రూ.15.84 లక్షలు మాత్రమే గుర్తించారు.

Similar News

News September 19, 2025

ఇచ్ఛాపురం: 100 ఏళ్లు జీవించి..మరొకరికి వెలుగునిచ్చారు

image

ఇచ్ఛాపురం పట్టణ మేజిస్ట్రేట్ పరేష్ కుమార్ అమ్మమ్మ విజయలక్ష్మి (100) గురువారం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. ఓ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్స్ సుజాత, కృష్ణలు ఆమె కార్నియాను సేకరించారు.

News September 19, 2025

SKLM: 10 నుంచి 12 గంటల వరకే ఈ అవకాశం

image

ఇవాళ దివ్యాంగుల స్వాభిమాన్ గ్రీవెన్స్ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశంలో నిర్వహించనున్నట్లు జడ్పి సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

News September 19, 2025

ఎచ్చెర్ల: యూనివర్సటిలో సంస్కృతి కోర్సు ప్రారంభం

image

ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటిలో సంస్కృతి కోర్సును వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ కే ఆర్ రజిని ఇవాళ ప్రారంభించారు. ఈ మేరకు జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పీఎం ఉష నిధుల ఆర్థిక సహకారంతో సంస్కృతంలో సర్టిఫికెట్ కోర్సును మొదలపెట్టామని చెప్పారు. సంస్కృతం భాష నుంచే మిగతా భాషలు వృద్ధి చెందాయని తెలియజేశారు.