News March 12, 2025
నరసన్నపేట: చిట్ ఫండ్ అధినేత కోరాడ గణేష్ ఆస్తుల జప్తు

నరసన్నపేటలోని ‘లక్ష్మీ గణేష్ చిట్స్’ సంస్థకు చెందిన కోరాడ గణేశ్వరరావు చరాస్తులను జప్తు చేస్తూ హోం శాఖ జీవో నెం. 46 ద్వారా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. కోరాడ గణేశ్వరరావు డిపాజిట్ల పేరుతో ప్రజల నుంచి రూ.5.86 కోట్లకు పైగా వసూలు చేసి మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నరసన్నపేట స్టేషన్లో 2021లో కేసు నమోదైంది. 5.86 కోట్లు వరకూ దోచుకోగా కేవలం చరాస్తులు రూ.15.84 లక్షలు మాత్రమే గుర్తించారు.
Similar News
News March 20, 2025
SKLM: ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు

జి.సిగడాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చెసుకుంటానని చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం అబార్షన్ చేయించాడు. వివాహం చేసుకోవాలని అడిగితే ససేమిరా అన్నాడు. మరోక అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సే మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 20, 2025
శ్రీకాకుళం: ఈ మండలాలకు ఆరెంజ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. ప్రజలు వడగాలులకు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ తమ అధికారిక ‘X’ ఖాతా ద్వారా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పొందూరు 38.2, ఆమదాలవలస 38.5, జి.సిగడాం 39.3, జలుమూరు 38.7, సరుబుజ్జిలి 39.2, సారవకోట 38.9, బూర్జ 39.5, నరసన్నపేట 37.6 ఈ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
News March 19, 2025
వంజంగి అమ్మాయికి గేట్లో 25వ ర్యాంక్

ఆమదాలవలస మండలం వంజంగి గ్రామానికి చెందిన పైడి పూజిత నేడు విడుదలైన గేట్-2025 ఫలితాలలో ఆల్ ఇండియా 25 ర్యాంకు సాధించారు. పూజిత నాగపూర్లోని వీఎన్ఐటీ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. పూజిత తండ్రి పైడి శ్రీనివాసరావు ఎల్.ఎన్.పేట ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. పూజిత తల్లి ఆదిలక్ష్మి గృహిణి. గేట్లో వంద మార్కులకు గాను 73 మార్కులు సాధించినట్లు తండ్రి శ్రీనివాస రావు తెలిపారు.