News September 22, 2024
నరసన్నపేట: తాటి చెట్టులో రావి మొక్క

నరసన్నపేట మండలం పెద్ద కరగాంలో ఉన్న నరికివేసిన తాటి చెట్టు మొండెం నుంచి రావి మొక్క రావడంతో గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చెట్టును నరికి వేశారు. పక్షులు గింజలను చెట్ల తొర్రలో వేయడంతో రావి మొక్క వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. అటుగా వెళ్లే ప్రయాణికులు సైతం పైన చెట్టు రావడడంతో ఆగి మరీ చూస్తున్నారు.
Similar News
News October 23, 2025
నరసన్నపేట: నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

నేల బావిలో పడి మతిస్థిమితం లేని వ్యక్తి మృతి చెందిన ఘటన నరసన్నపేటలోని దేశవానిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన జనార్ధన్ (45) గత కొన్నేళ్లుగా మానసిక పరిస్థితి బాగులేదు. బుధవారం ఉదయం కనిపించకపోగా కుటుంబీకులు వెతికారు. సాయంత్రం నెలబావిలో శవమై తేలడంతో స్థానికులు కుటుంబీకులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు డెడ్ బాడీని బయటకు తీశారు. బంధువుల ఫిర్యాదుతో ఎస్సై దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు.
News October 23, 2025
టెక్కలి: రూ. 5 కోట్లతో ఎండల మల్లన్న ఆలయాభివృద్ధి

ఎండల మల్లికార్జున స్వామి సమగ్ర ఆలయాభివృద్ధికి రూ. ఐదు కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
News October 23, 2025
టెక్కలి: రూ. 5 కోట్లతో ఎండల మల్లన్న ఆలయాభివృద్ధి

ఎండల మల్లికార్జున స్వామి సమగ్ర ఆలయాభివృద్ధికి రూ. ఐదు కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.