News August 2, 2024
నరసన్నపేట: పెన్షన్ పంపిణీలో అలసత్వం.. 30 మందికి నోటీసులు

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం నగదు పంపిణీలో అలసత్వం ప్రదర్శించిన 30 మంది సిబ్బందికి షోకాజ్ నోటీసులిచ్చినట్లు నరసన్నపేట ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 5.30 గంటలకు పెన్షన్ ప్రారంభించాల్సి ఉండగా 6.30 గంటలు వరకు కూడా నగదు పంపిణీని సిబ్బంది ప్రారంభించలేదన్నారు. దీంతో వారికి నోటీసులిచ్చినట్లు తెలిపారు.
Similar News
News December 21, 2025
శ్రీకాకుళం: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. పోలాకి మండలంలో MLA బగ్గు రమణమూర్తి ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు.
News December 21, 2025
సోంపేట: చెరువులను కాపాడాలని కలెక్టర్కు ఫిర్యాదు

సోంపేట పట్టణంలోని చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు జడ్పీటీసీ సభ్యురాలు యశోద శనివారం వినతి ఇచ్చారు. దీనిపై విచారణ చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూ అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాసపురం సర్పంచ్ టి. జోగారావు తదితరులు పాల్గొన్నారు.
News December 21, 2025
విశేష స్పందనతో జనవరి 3 వరకు సైకిల్ యాత్ర: SP

ప్రజల్లో విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న “అభ్యుదయం సైకిల్ యాత్ర” షెడ్యూల్లో స్వల్ప మార్పు చేయడం జరిగిందని ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 3 వరకు కొనసాగుతుందని ఆయన తెలియజేసారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు పూర్తిగా నియంత్రణకు అభ్యుదయ సైకిల్ ఉపయోగపడుతుందని అన్నారు.


