News February 4, 2025

నరసరావుపేట: అంగన్వాడీ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి

image

పేద కుటుంబాల వారు తమ పిల్లలను అంగన్వాడీ సెంటర్ల ద్వారా చదివించి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సూచించారు. మంగళవారం పేద కుటుంబాలకు చెందిన వారికి మూడు చక్రాల రిక్షాలను అందజేశారు. పేదరికం నుంచి చదువు మాత్రమే బయటికి తీసుకువస్తుందన్నారు. చిన్నారులను చిత్తు కాగితాలు ఏరుకునేందుకు పంపవద్దని తల్లిదండ్రులను కలెక్టర్ కోరారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో మధులత ఉన్నారు.

Similar News

News February 23, 2026

MHBD: ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై పోక్సో కేసు

image

బయ్యారం మండలంలోని ఓ గ్రామానికి కుంజా మధు అనే యువకుడు ప్రేమ పేరుతో బాలికను మోసం చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. మాయమాటలతో బాలికను శారీరకంగా లోబర్చుకున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెల్లడించారు.

News February 23, 2026

భారత్ సరిచేసుకోవాల్సిన 3 తప్పులివే: మంజ్రేకర్

image

SAతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘోరంగా విఫలమైన నేపథ్యంలో మాజీ క్రికెటర్ మంజ్రేకర్ 3 మార్పులు సూచించారు. స్పిన్నర్లను బాగా ఎదుర్కొనేవారిని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపాలని చెప్పారు. అలాగే పేసర్లు వేగం తగ్గించి వేసే ‘పేస్-ఆఫ్’ డెలివరీలను ఎదుర్కోవడంలో కెప్టెన్ సూర్య సహా ఇతర బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారని గుర్తుచేశారు. కుల్దీప్‌ను జట్టులోకి తెచ్చి బౌలింగ్‌ను పటిష్ఠం చేయాలని సలహా ఇచ్చారు.

News February 23, 2026

అన్నమయ్య: 40 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి పరార్

image

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మైనర్ అదృశ్యం కలకలం రేపింది. సీఐ వెంకటేశులు వివరాల మేరకు.. మండలంలోని నాయనిచెరువుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(40)కి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయనకు 17 ఏళ్ల యువతితో పరిచయమైంది. ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి యువతి కనిపించడం లేదు. ప్రేమ పేరుతో యువతి ఆ 40 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తమకు తెలిసిందని సీఐ తెలిపారు.