News April 10, 2025

నరసరావుపేట: అక్రమ రవాణా జరగకుండా చర్యలు: కలెక్టర్  

image

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లో JC సూరజ్, ASP సంతోష్‌తో కలిసి గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే వర్షా కాలంలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ సాధ్యంపై చర్చించారు. మాన్యువల్ రీచ్‌లు పట్టా లాండ్ డీ కాస్టింగ్ ఓపెన్ రీచ్‌ల కార్యకలాపాల ద్వారా కావలసిన ఇసుక సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

Similar News

News November 24, 2025

పెద్దపల్లి కోర్టు ఏర్పాటు వివాదం.. సుల్తానాబాద్ న్యాయవాదుల ఆగ్రహం

image

పెద్దపల్లి జిల్లా కోర్టును పెద్దపల్లిలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే విజయరమణరావును కలిసి వినతిపత్రం ఇచ్చిన న్యాయవాదులను ఎమ్మెల్యే అవమానించారనే ఆరోపణలతో సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు సోమవారం కోర్టు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు మేకల తిరుపతిరెడ్డి, కార్యదర్శి భూమయ్యతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

News November 24, 2025

లేటెస్ట్ అప్డేట్స్

image

* ధర్మేంద్ర మృతికి సంతాపం తెలియజేసిన చంద్రబాబు, రేవంత్, పవన్
* రాముడి పాదాల వద్ద ఎన్టీఆర్ పార్టీలో చేరా.. NTR చలవతోనే అవినీతిమయ రాజకీయాల్లోనూ రాణిస్తున్నా: మంత్రి తుమ్మల
* గ్రామపంచాయతీ రిజర్వేషన్లపై జీవో 46ను ఉపసంహరించుకోవాలన్న బీసీ సంఘాలు.. ప్రతి గ్రామంలో నిరాహార దీక్షలు చేయాలని తీర్మానం
* నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 331, నిఫ్టీ 108 పాయింట్లు దిగువకు

News November 24, 2025

మంథనిలో మహిళా సాధికారతపై మంత్రి శ్రీధర్ బాబు ఫోకస్

image

మంథని ఎక్లాస్‌పూర్‌లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు, మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. VIATRIS సాయంతో 21 కుట్టు కేంద్రాలు, 850 మిషన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కుట్టు కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు వంటి యూనిట్లతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.