News April 10, 2025

నరసరావుపేట: అక్రమ రవాణా జరగకుండా చర్యలు: కలెక్టర్  

image

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్‌లో JC సూరజ్, ASP సంతోష్‌తో కలిసి గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే వర్షా కాలంలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ సాధ్యంపై చర్చించారు. మాన్యువల్ రీచ్‌లు పట్టా లాండ్ డీ కాస్టింగ్ ఓపెన్ రీచ్‌ల కార్యకలాపాల ద్వారా కావలసిన ఇసుక సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

Similar News

News November 11, 2025

నిఘా నీడలో విశాఖ నగరం: హోంమంత్రి

image

విశాఖలో ఈనెల 14,15న పార్టనర్షిప్ సమ్మిట్ జరుగుతున్న నేపథ్యంలో నగరమంతా నిఘా నీడలో ఉంచాలని, అణువణువునా గస్తీ ఏర్పాటు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి నక్కపల్లిలో తన క్యాంపు కార్యాలయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. విశాఖ నగరమంతా డ్రోన్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.

News November 11, 2025

₹12.92 ట్రిలియన్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

image

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి ₹12.92 ట్రిలియన్లకు చేరింది. APR 1-NOV 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి ₹12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్‌లు గత ఏడాది కన్నా 18% తగ్గి ₹2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. FY 2025-26కి ₹25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం.

News November 11, 2025

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై కలెక్టర్ VC

image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్ష చేయాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై జిల్లాలోని జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్, పీడీ హౌసింగ్‌తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.