News April 10, 2025
నరసరావుపేట: అక్రమ రవాణా జరగకుండా చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. కలెక్టరేట్లో JC సూరజ్, ASP సంతోష్తో కలిసి గురువారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే వర్షా కాలంలో 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిలువ సాధ్యంపై చర్చించారు. మాన్యువల్ రీచ్లు పట్టా లాండ్ డీ కాస్టింగ్ ఓపెన్ రీచ్ల కార్యకలాపాల ద్వారా కావలసిన ఇసుక సాధించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 22, 2025
నేడు మంత్రులతో సీఎం రేవంత్ భేటీ

TG: ఇవాళ మ.2 గంటలకు జూబ్లీహిల్స్ నివాసంలో CM రేవంత్ మంత్రులతో భేటీకానున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తేదీలను నేడు ఖరారు చేసే అవకాశముంది. అలాగే సభలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, బడ్జెట్ కసరత్తు, MPTC, ZPTC ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్పై మంత్రులతో చర్చించనున్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల భర్తీ, వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
News December 22, 2025
కూతురు గొప్పా? కోడలు గొప్పా?

మన ధర్మం ప్రకారం కోడలే ఇంటికి గృహలక్ష్మి. పుట్టినింటిని వదిలి, మెట్టినింటి గౌరవం కోసం పేరును, జీవితాన్ని అంకితం చేసే త్యాగశీలి ఆమె. భర్తను ప్రేమగా చూసుకుంటూ అందరికీ అమ్మలా అన్నం పెట్టే గుణశీలి. పితృదేవతలు మెచ్చేలా వంశాన్ని ఉద్ధరించే శక్తి కోడలికే ఉంది. ఏ ఇంట కోడలిని గౌరవించి, లక్ష్మిగా భావిస్తారో ఆ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఈ ఇంటి కూతురు మెట్టినింటి కోడలిగా వారి అభ్యున్నతికి కారణమవుతుంది.
News December 22, 2025
జగిత్యాల జిల్లాలో 12 నూతన సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదన

జగిత్యాల జిల్లాలో మొత్తం 51 Pacsలు ఉండగా, 1.5 లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. అయితే జిల్లాలో 12 కొత్త సొసైటీలను ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ఇందులో జిల్లాలోని మోరపల్లి, పోరండ్ల, లక్ష్మీపూర్, మద్దులపల్లి, రాపల్లి, వర్తకొండ, జగ్గసాగర్, కొత్త దాంరాజ్పల్లి, బుగ్గారం, మన్నెగూడెం, అంబారిపేట, కట్కాపూర్లో ట్రైబల్ సొసైటీ ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదించారు.


