News March 26, 2025
నరసరావుపేట: ‘అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన, వ్యక్తులు సంస్థలు అర్హులని అన్నారు. https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/ ఆన్లైన్లో మార్చి 31లోగా పోర్టల్ ద్వారా, లేదా స్వయంగా దరఖాస్తులను సమర్పించాలన్నారు.
Similar News
News April 2, 2025
మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదం.. వార్డు సభ్యుడు మృతి

మాకవరపాలెం మండలంలో అవంతి కళాశాల ఎదురుగా బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమ బోయినపాలెంకి చెందిన వార్డు సభ్యుడు లాలం మణిబాబు మృతి చెందాడు. మాకవరపాలెం నుంచి బైక్పై స్వగ్రామం వెళుతుండగా అవంతి కళాశాల వద్దకు వచ్చేసరికి కళాశాల లోపల నుంచి వస్తున్న బైక్ ఢీ కొట్టింది. దీంతో మణిబాబును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 2, 2025
ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

కొత్తగూడెం జిల్లాలో మార్చి 21 నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి ఎం వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్ మాధవరావు తెలిపారు. చివరగా సోషల్ స్టడీస్ పరీక్షకు 12273 మంది విద్యార్థులకు గాను 12240 విద్యార్థులు హాజరుకాగా 33 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. సప్లమెంటరీ విద్యార్థులు 26 మంది గాను 17 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు
News April 2, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

☞ ఆత్మకూరు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ ☞ అహోబిలేశుని సన్నిధిలో MLA భూమా దంపతులు ☞ శ్రీశైల మల్లన్న దర్శించుకుని.. SLBC టన్నెల్ పరిశీలించిన తెలంగాణ మంత్రి పొంగులేటి ☞ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నంద్యాలలో ధర్నా ☞ యాగంటి క్షేత్రానికి మంత్రి బీసీ వరాల జల్లు ☞ నంద్యాలలో FAPTO ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల ధర్నా ☞ మహా ‘నంది’కి మేఘాల పందిరి ☞ క్రీడాకారులకు ఆరు వారాల సర్టిఫికెట్ కోర్స్: DSO