News February 27, 2026

నరసరావుపేట ఆర్టీవో బాధ్యతల నుంచి రిలీవ్

image

నరసరావుపేట ఆర్డీవో మధులతను బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. 2018 గ్రూప్-1 నియామకాలపై ఏపీ హైకోర్టులో కొనసాగుతున్న న్యాయ ప్రక్రియ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ నియామకాల ద్వారా చేరిన అధికారులను తాత్కాలికంగా పోస్టుల నుంచి తప్పిస్తూ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అదే క్రమంలో మధులత కూడా రిలీవ్ చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 26 మంది అధికారులను రిలీవ్ చేశారు.

Similar News

News April 14, 2026

ఆదిలాబాద్: హెల్మెట్ తీర్మానం.. ఆదర్శంగా నిలిచిన జామిడి

image

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డికి జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ వినూత్నమైన తీర్మానాన్ని అందజేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తామని, ఇతర గ్రామాల వారు కూడా హెల్మెట్ ఉంటేనే తమ గ్రామంలోకి రావాలన్న నిర్ణయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో వివరించారు. ఈ బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని డీజీపీ అభినందించారు.

News April 14, 2026

వరంగల్: హెల్మెట్ లేకుంటే నో ఎంట్రీ

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జనగామ(D) తరిగొప్పులలో ‘నో హెల్మెట్-నో ఎంట్రీ’ నిబంధనను అమలు చేశారు. ఈ మేరకు SI శ్రీదేవి, MPDO దేవేందర్ రెడ్డి గ్రామ సరిహద్దుల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. హెల్మెట్ లేకుంటే గ్రామంలోకి ప్రవేశం లేదని హెచ్చరించారు. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో ఇదే నిబంధనను అమలు చేయడం విశేషం.

News April 14, 2026

ఎమ్మిగనూరులో 650 ఉద్యోగాలకు జాబ్ మేళా

image

యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి సూచించారు. ఏప్రిల్ 21న ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9:30 నుంచి ఈ మేళా నిర్వహించనున్నారు. 11 ప్రైవేట్ కంపెనీల్లోని 650 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండి, పదో తరగతి నుంచి పీజీ వరకు చదివిన వారు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.