News January 31, 2025

నరసరావుపేట: ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

image

ఆర్టీసీ బస్సులో పర్స్ కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై వన్‌టౌన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె.సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్‌కి వచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది. పర్స్ కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 18, 2025

నాగర్ కర్నూల్: నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు

image

42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. జిల్లాలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడి పూర్తి సహకారం అందించడంతో బంద్ కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో కొనసాగించాలని పోలీసు శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

News October 18, 2025

DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

image

DRDO అనుబంధ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DRDE) 5 జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. BE, B.Tech, B.TEXT, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు NET, CSIR-UGC NET, గేట్ స్కోరు సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్వాలియర్‌లో DRDEలో నవంబర్ 6న ఉదయం 9.30గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News October 18, 2025

మదనపల్లెలో దారి దోపిడీ

image

బెంగళూరు టు మదనపల్లెకు వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారి దోపిడీకి గురయ్యాడు. బాధితుడు 1టౌన్ పోలీసులకిచ్చిన ఫిర్యాదు మేరకు.. సత్సంగ్ స్కూల్ దగ్గర ఉండే విజయ్ కుమార్ రెడ్డి బెంగళూరులో పని చేస్తాడు. శుక్రవారం రాత్రి ఆత్మకూరు బస్సులో వచ్చి 1 గంటకు నక్కల దిన్నెలో దిగాడు. నడచి వెళుతుండగా లిఫ్ట్ ఇస్తామని ఇద్దరు బైక్ ఎక్కించుకుని 15 గ్రాముల బంగారు, రూ.20 వేల నగదు దోపిడీ చేశారు.