News January 31, 2025

నరసరావుపేట: ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

image

ఆర్టీసీ బస్సులో పర్స్ కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై వన్‌టౌన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె.సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్‌కి వచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది. పర్స్ కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 17, 2025

కేయూ: ఆ సభ్యుల నియామకంపై SFI తీవ్ర అభ్యంతరం

image

కాకతీయ యూనివర్సిటీ విచారణ కమిటీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను సభ్యులుగా పెట్టడాన్ని SFI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత కమిటీ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొంటూ ప్రిన్సిపల్, హాస్టల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటుకు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రొఫెసర్ రామచంద్రానికి వినతిపత్రం అందించింది.

News November 17, 2025

కేయూ: ఆ సభ్యుల నియామకంపై SFI తీవ్ర అభ్యంతరం

image

కాకతీయ యూనివర్సిటీ విచారణ కమిటీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను సభ్యులుగా పెట్టడాన్ని SFI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత కమిటీ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొంటూ ప్రిన్సిపల్, హాస్టల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటుకు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రొఫెసర్ రామచంద్రానికి వినతిపత్రం అందించింది.

News November 17, 2025

తిరుపతి: చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ డిస్మిస్

image

నెల్లూరు ఏసీబీ కోర్టులో సోమవారం టీటీడీ కల్తీ నెయ్యి కేసుతో సంబంధం ఉన్న చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ అయ్యింది. ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జయశేఖర్ వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. 2 సార్లు హవాలా ద్వారా చిన్న అప్పన్న డెయిరీ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.20 లక్షలు, రూ.30 లక్షలు ఢిల్లీ పటేల్ నగర్ వద్ద 2023లో తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.