News January 31, 2025

నరసరావుపేట: ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

image

ఆర్టీసీ బస్సులో పర్స్ కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై వన్‌టౌన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె.సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్‌కి వచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది. పర్స్ కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 21, 2025

BREAKING: ములుగు ఎస్పీ శబరీష్ బదిలీ.. కొత్త ఎస్పీగా సుధీర్

image

ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీశ్ మహబూబాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో గతంలో ములుగు అడిషనల్ ఎస్పీగా పని చేసిన సుధీర్ రాంనాథ్ కేకన్‌ను జిల్లా ఎస్పీగా కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ములుగులో పనిచేసిన అనుభవం నేపథ్యంలో ఆయనను ములుగు జిల్లాకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించింది.

News November 21, 2025

సిరిసిల్ల: ‘పిల్లలకు ఆరునెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి’

image

సిరిసిల్ల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో NATIONAL NEW BORN WEEK అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. నవజాత శిశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు. ఆరు నెలల వయసు వచ్చే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇప్పించాలని సూచించారు. డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చీకోటి సంతోష్ కుమార్, వైద్యులు పాల్గొన్నారు.

News November 21, 2025

సీఎం మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ క్లారిటీ

image

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి Dy.CM డీకే శివకుమార్ తెరదించారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారని, అందుకు తానూ సహకరిస్తానన్నారు. తామిద్దరం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తామన్నారు. ‘అందరికీ మంత్రిపదవి అవకాశం రావాలని సీఎం యోచిస్తున్నారు. అందుకే క్యాబినెట్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీ MLAలు ఢిల్లీకి వచ్చారు’ అని తెలిపారు.