News January 31, 2025

నరసరావుపేట: ఆర్టీసీ బస్సులో రూ. 2 లక్షలు చోరీ

image

ఆర్టీసీ బస్సులో పర్స్ కత్తిరించి రెండు రూ. 2 లక్షలు అపహరించిన ఘటనపై వన్‌టౌన్ సీఐ విజయ్ చరణ్ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన కె.సుజాత గుంటూరు వెళ్ళేందుకు బస్టాండ్‌కి వచ్చారు. బస్సు ఎక్కిన తర్వాత పర్సులో ఉండాల్సిన నగదు మాయమైంది. పర్స్ కింది భాగం కత్తిరించి ఉండటం గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 8, 2025

BREAKING: ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అనంతరం ఈవీఎంలను తెరవనున్నారు. మొత్తం 19 కేంద్రాల్లో లెక్కింపు కొనసాగుతోంది. 70 స్థానాల్లో 36 చోట్ల విజయం సాధించిన పార్టీ అధికారం చేపట్టనుంది. మధ్యాహ్నం 12 గంటలలోపు ఫలితాలపై ఓ క్లారిటీ రానుంది. రిజల్ట్స్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు WAY2NEWS యాప్‌లో తెలుసుకోండి.
Stay Tuned.

News February 8, 2025

జీతాలు వెనక్కి ఇవ్వండి: లెక్చరర్లకు నోటీసులు!

image

AP: డిగ్రీ కాంట్రాక్టు లెక్చరర్లు 2019లో తీసుకున్న 2నెలల జీతాలు వెనక్కివ్వాలని విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్ కాంట్రాక్ట్ జూ.లెక్చరర్ల తరహాలో తమకు జీతమివ్వాలని డిగ్రీ కా.లెక్చరర్లు విన్నవించారు. ఆ మేరకు రాష్ట్రంలోని 600మందికి APL, మే నెలలకు గానూ 51రోజుల జీతాలందాయి. ఇలా తీసుకుంటే దాన్ని అదనంగా పరిగణించి జీతాలు వెనక్కి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

News February 8, 2025

శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్ రౌండప్

image

☞ 11 నుంచి అంగన్వాడీల పోస్టుల భర్తీకి ముఖాముఖి
☞ నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
☞ రూ.200కోట్ల అభివృద్ధి పనులపై హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ తొలి సంతకం
☞ సోమందేపల్లి: కేతగానిచెరువులో వివాహిత ఆత్మహత్య
☞ నల్లమాడ, ఓడీచెరువులో గొలుసు చోరీ దొంగ అరెస్ట్
☞ 10న మడకశిరలో కలెక్టర్ ప్రజా వేదిక
☞ ఫ్యాక్షన్ గ్రామాలపై నిఘా పెట్టండి: ఎస్పీ రత్న
☞ ధర్మవరం జాబ్ మేళాలో 52 మందికి ఉద్యోగాలు

error: Content is protected !!