News February 19, 2025

నరసరావుపేట: ఈ కొండపై పరమశివుడు తపస్సు చేశాడు

image

మహాశివరాత్రికి కోటప్పకొండ తిరునాళ్ల ఘనంగా నిర్వహిస్తారు. దీనిని త్రికోటేశ్వర ఆలయం అని కూడా అంటారు. దక్షయజ్ఞంలో జరిగిన అవమానం కారణంగా సతీ దేవి దేహత్యాగం చేస్తుంది. సతీదేవి వియోగం తర్వాత పరమశివుడు ముల్లోకాలు తిరిగి కోటప్పకొండ చేరుకున్నాడు. పరమశివుడు బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. బాల దక్షిణామూర్తి రూపంలో తపస్సు చేసిన ఆ పవిత్ర స్థలమే త్రికోటేశ్వరాలయముగా పేరుగాంచింది.

Similar News

News November 28, 2025

వనపర్తి: నామినేషన్‌కు ముందు కొత్త ఖాతా తప్పనిసరి: శ్రీనివాసులు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేసే అభ్యర్థులు తమ పేరు మీద కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలని, ఎన్నికల వ్యయం మొత్తాన్ని దీని ద్వారానే చేయాలని వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు తెలిపారు. నామినేషన్ సమయంలో ఇచ్చే ఎక్స్‌పెండీచర్ బుక్‌లో ప్రతి ఖర్చును నమోదు చేయాలని సూచించారు. 15 రోజులకు ఒకసారి ఆ వివరాలను నోడల్‌ అధికారికి చూపించి సంతకం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

News November 28, 2025

కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

image

​HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ​ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.

News November 28, 2025

వనపర్తి: ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు: పరిశీలకులు

image

వనపర్తి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు సూచించారు. ఓటర్లను ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పార్టీలు తమ వంతు సహకారం అందించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని (ఎంసీసీ) తూచా తప్పకుండా పాటించాలని ఆయన స్పష్టం చేశారు.