News April 14, 2025

నరసరావుపేట: ఎకరాకు రూ.1.60కోట్లు ఫైనల్  

image

చీరాల ఓడరేవు బైపాస్ రోడ్డుకు సంబంధించి భూ సేకరణలో ప్రభుత్వం ఎకరాకు 1.60కోట్లు చెల్లించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైవేకి సంబంధించి జొన్నలగడ్డ, రావిపాడు, కేసానుపల్లి, గుంట గార్లపాడు పంచాయతీల పరిధిలోని పొలాలను అధికారులు సేకరిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ధర కన్నా అదనంగా చెల్లించేందుకు జిల్లా అధికారులు రైతులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో రైతు ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. 

Similar News

News April 17, 2026

హెచ్‌పీవీ టీకా కార్యక్రమం వేగవంతం చేయాలి: కలెక్టర్

image

సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష సూచించారు. ఆయుష్ సేవలు, యోగా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని తెలిపారు. హెచ్‌పీవీ టీకాలు రెండు నెలల్లో 6 వేలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్బీఎస్‌కే ద్వారా పిల్లల పరీక్షలు, గర్భిణుల సంరక్షణ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపుపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News April 17, 2026

బాల, బాలికలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి: కలెక్టర్

image

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘బడి పిలుస్తోంది’ ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హత గల బాల, బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్లమ్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News April 17, 2026

హార్ముజ్‌ను ఇరాన్ ఇక ఆయుధంగా వాడదు: ట్రంప్

image

హార్ముజ్ జలసంధిని ఇకపై ఎప్పటికీ తెరిచే ఉంచేందుకు ఇరాన్ అంగీకరించిందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇకపై దానిని ఆ దేశం ఆయుధంగా ప్రయోగించదన్నారు. తమ సహకారంతో ఇరాన్ హార్ముజ్‌లోని మైన్స్‌ను తొలగిస్తోందన్నారు. యుద్ధం వేళ సమన్వయం పాటిస్తూ సహకరించిన సౌదీ, యూఏఈ, ఖతర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌ అద్భుతమైన వ్యక్తులని పొగడ్తలతో ముంచెత్తారు.