News April 9, 2024
నరసరావుపేట ఎన్నికలలో బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్

రానున్న సార్వత్రిక ఎన్నికలలో పీఓలు భయంతో కాకుండా బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో పిఓలు, ఏఎల్ఎంటీలకు ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పోలింగ్ జరిగే రోజున జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ప్రతికూల పరిస్థితులు ఏమైనా ఎదురైతే చాకచక్యంగా వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు.
Similar News
News April 5, 2025
గుంటూరు-గుంతకల్లు రైల్వే లైన్ పనులు వేగవంతం

గుంటూరు-గుంతకల్లు మధ్య 2వ రైలు మార్గం పనులు 347కి.మీ పూర్తయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 401 కి.మీ మార్గం డబ్లింగ్, విద్యుదీకరణ కోసం రూ.3,631 కోట్లు భరిస్తామని ఐదేళ్ళ క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. పూర్తి స్థాయిలో పనులు పూర్తైతే ఈ మార్గంలో నడిచే రైళ్ళకు గంటన్నర సమయం ఆదా అవుతుందని అంటున్నారు.
News April 5, 2025
మంగళగిరి: అఘోరీ ఉచ్చు నుంచి బయటపడిన శ్రీవర్షిణి

అఘోరీ చేతుల్లో నుంచి మంగళగిరి యువతి శ్రీవర్షిణిని పోలీసులు సురక్షితంగా కాపాడారు. నెల రోజుల క్రితం శ్రీవర్షిణి తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన లేడీ అఘోరీ, మాయమాటలతో ఆమెను వశం చేసుకుని గుజరాత్కు తీసుకెళ్లింది. కూతురు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. కేసు గుజరాత్ వరకు వెళ్లింది. అక్కడ అఘోరీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శ్రీవర్షిణిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News April 5, 2025
గుంటూరులో సిటీ బస్సుకు నిప్పంటించిన దుండగులు

బృందావన్ గార్డెన్స్లో శుక్రవారం సాయంత్రం ఓ ఘటన కలకలం రేపింది. ఆటలాడుకుంటూ వేంకటేశ్వర స్వామి గుడి వద్దకు వచ్చిన ఇద్దరు మైనర్లు పార్కింగ్లో ఉన్న సిటీ బస్సులోకి ఎక్కి ఇంజిన్ ఆయిల్ పోసి నిప్పంటించడంతో బస్సు కాలిపోయింది. మంటలు పక్కనే ఉన్న మరో బస్సును కూడా తాకాయి. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పట్టాభిపురం పోలీసులు, నిప్పంటించిన మైనర్లను గుర్తించారు.