News April 8, 2025
నరసరావుపేట: ‘క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.60 లక్షలు కొట్టేశారు’

క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.60 లక్షలు కొట్టేశారని తమకు న్యాయం చేయాలని బాధితులు వెంకటేశ్వరరెడ్డి, కృష్ణారెడ్డి, సతీశ్, శ్రీనివాసులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాగేశ్వర్, రవికుమార్లు ఆన్లైన్ నెట్వర్క్ పేరుతో అత్యధిక లాభాలు వస్తాయని ఆశ చూపారు. పెట్టుబడి పెట్టించి, డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
Similar News
News October 16, 2025
వనపర్తి: ‘భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి’

మార్కెట్ ధరలకు అనుగుణంగా భూ నిర్వాసితులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరు వెంకట్ రాములు డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి, RRR రింగ్ రోడ్డు భూనిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
News October 16, 2025
పటాన్ చెరు: పోషకాహారం అందించేందుకే పోషన్ అభియాన్: కలెక్టర్

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకే పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. పటాన్ చెరులో పోషన్ అభియాన్ ముగింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీల పాత్ర కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.
News October 16, 2025
రేపు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి పర్యటన

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రేపు(శుక్రవారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం ఇంఛార్జి ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి ఉదయం 10:30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. అనంతరం అధికారులతో నిర్వహించే సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఆయన పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.