News February 16, 2025

నరసరావుపేట: జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ

image

జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని శనివారం ఎస్పీ కె.శ్రీనివాసరావు నిర్వహించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారుల ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోక్సో కేసులు, చోరీలు, మిస్సింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలన్నారు. 112 ఎమర్జెన్సీ కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. అదనపు ఎస్పీ సంతోశ్ ఉన్నారు.

Similar News

News November 24, 2025

TAKE A BOW.. 93 రన్స్, 6 వికెట్లు

image

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్సులో 8వ స్థానంలో వచ్చిన అతడు 91 బంతుల్లోనే 93 రన్స్ చేశారు. ఏకంగా 7 సిక్సర్లు బాదారు. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయగలిగింది. అటు బౌలింగ్‌లో 6 కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. చక్కటి బౌన్సర్లతో మనోళ్లను ముప్పుతిప్పలు పెట్టారు.

News November 24, 2025

భక్తులకు ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్

image

AP: 2019-24 మధ్య తిరుమలకు వెళ్లిన భక్తులను మోసం చేశారని Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఐదేళ్లలో 20కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ‘గత TTD బోర్డులోని అధికారులు భక్తులకు ద్రోహం చేశారు. మనం భక్తితో నమస్కరిస్తుంటే, వాళ్లు మన హృదయాలను ముక్కలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, మనం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తుంచేశారు’ అని ట్వీట్ చేశారు.

News November 24, 2025

వేములవాడలో ప్రచార రథం వద్ద కొనసాగుతున్న దర్శనాలు

image

వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆలయం ముందు భాగంలోని ప్రచార రథం వద్ద భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. ప్రచార రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి నిత్య కైంకర్యాలను ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించి తరిస్తున్నారు.