News February 16, 2025
నరసరావుపేట: జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించిన ఎస్పీ

జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశాన్ని శనివారం ఎస్పీ కె.శ్రీనివాసరావు నిర్వహించారు. ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారుల ఫిర్యాదులపై వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫోక్సో కేసులు, చోరీలు, మిస్సింగ్ కేసుల దర్యాప్తు త్వరగా పూర్తి చేయాలన్నారు. 112 ఎమర్జెన్సీ కాల్స్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ సూచించారు. అదనపు ఎస్పీ సంతోశ్ ఉన్నారు.
Similar News
News March 27, 2025
పాలమూరు: దంపతులు మృతి.. ఆ ఊరిలో విషాదం

రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందడంతో నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన సక్కుబాయి(40), పాండు(45) రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధి కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆ నలుగురు అనాథలుగా మారారు.
News March 27, 2025
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం: నిమ్మల

AP: CM చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్న నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 2026 నాటికి నిర్వాసితులకు అన్ని కాలనీలను నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.
News March 27, 2025
పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా

పెద్దపల్లి జిల్లాలోని ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా అంతర్గాం 39.8℃ నమోదు కాగా ముత్తారం 39.7, రామగిరి 39.6, ఓదెల 39.6, కాల్వ శ్రీరాంపూర్ 39.5, సుల్తానాబాద్ 39.3, పాలకుర్తి 38.9, మంథని 38.6, ధర్మారం 38.5, కమాన్పూర్ 38.4, రామగుండం 38.3, పెద్దపల్లి 38.1, ఎలిగేడు 37.7, జూలపల్లి 36.9℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.