News March 20, 2024

నరసరావుపేట టీడీపీ టికెట్‌పై రగడ

image

నరసరావుపేట TDPలో టికెట్ రగడ కొనసాగుతోంది. నేడు అధిష్ఠానం మూడో జాబితా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో YCP నేత జంగా కృష్ణమూర్తిని TDPలో చేర్చుకొని ఆయనకు టికెట్ ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. నరసరావుపేటలో ఎప్పటి నుంచో పార్టీని కాపాడుతున్న అరవింద్ బాబుకే టికెట్ ఇవ్వాలని మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ రామిరెడ్డి ఆత్మహత్యకు యత్నించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Similar News

News November 14, 2025

గుంటూరు మిర్చి యార్డులో ధరలో ఇలా.!

image

గుంటూరు మిర్చి యార్డుకు గురువారం 48,406 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 47,533 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 13,564 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.

News November 14, 2025

మాతృ మరణాల నివారణే ప్రధాన లక్ష్యం: కలెక్టర్

image

గుంటూరు జిల్లాలో మాతృ మరణాలు జరగకుండా అన్ని వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు. హైరిస్క్ గర్భిణులను నిరంతరం పర్యవేక్షించి, సకాలంలో వైద్యం అందించాలని సూచించారు. ఆరోగ్య పరీక్షలు, పౌష్టికాహారం, రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలన్నారు. సమష్టిగా కృషి చేసి మాతృ మరణాలు నివారించాలని ఆమె పిలుపునిచ్చారు.

News November 13, 2025

10 రోజుల్లో పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలి: APTF

image

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, ప్రదానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల పీఎఫ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బసవలింగారావు, ఖాలీద్ గురువారం జడ్పీ ఛైర్‌పర్సన్ క్రిస్టీనాను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. 10 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.