News February 22, 2025

నరసరావుపేట: తిరునాళ్లకు సిద్ధమవుతున్న ప్రభలు

image

మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి తిరునాళ్లు వైభవంగా జరగనున్నాయి. ఈ తిరునాళ్లకు భారీ విద్యుత్ ప్రభలు కొలువు తీరుతాయి. నరసరావుపేట, చిలకలూరిపేట మండలాలలోని పలు గ్రామాల ప్రజలు పోటా, పోటీగా ప్రభలు నిర్మిస్తారు. ఊరంతా కలిసికట్టుగా ఈ ప్రభ పనుల్లో పాల్గొని, ఒక్కో ప్రభ 90 అడుగులకుపైగా వరకు నిర్మిస్తారు. ఒక్కో ప్రభ వ్యయం రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఉంటుంది. 

Similar News

News October 26, 2025

RAINS: శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక అధికారిగా చక్రదర్ బాబు

image

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను తీవ్ర వాయుగుండం రూపంలో దూసుకొస్తుంది. ఈ తుఫాను నుంచి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక అధికారిగా IAS చక్రదర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జిల్లా JC గా పనిచేసిన అనుభవం ఇతనికుంది.

News October 26, 2025

జనగామ: ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టుల దరఖాస్తులకు నేడే ఆఖరు

image

జిల్లాలోని కస్తూర్బాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఏఎన్ఎం, అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఆదివారం ఆఖరు తేదీ అని ఇన్‌ఛార్జి డీఈవో పింకేశ్ కుమార్ తెలిపారు. రఘునాథపల్లి, తరిగొప్పుల కేజీబీవీల్లో ఒక్కో ఏఎన్ఎం పోస్టు, దేవరుప్పుల, నర్మెట్టలో ఒక్కో అకౌంటెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు నేడు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News October 26, 2025

కేయూలో మధుశ్రీ-సౌజన్య ఘటనపై విచారణ కమిటీ

image

సుబేదారి యూనివర్సిటీ మహిళా కళాశాల కాంట్రాక్ట్ అధ్యాపకురాలు జి. మధుశ్రీ, ప్రిన్సిపల్ బీఎస్ఎల్ సౌజన్య ఘటనపై కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం విచారణ కమిటీని నియమించారు. కమిటీ ఛైర్మన్‌గా ప్రొఫెసర్ సుంకరి జ్యోతి (ప్రిన్సిపల్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల)ను, సభ్యులుగా ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్, ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహ చారి, ప్రొఫెసర్ సీ.జే. శ్రీలత తదితరులను నియమించారు.