News February 1, 2025

నరసరావుపేట: దూరవిద్య ఇంటర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభం

image

దూరవిద్య ఇంటర్ పరీక్షలు మార్చి నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ శనివారం తెలిపారు. సైన్సు,ఆర్ట్స్ గ్రూపుల్లో అడ్మిషన్లు పొంది 2,387 మంది జిల్లాలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినకొండ పట్టణాల్లో మొత్తం 9 పరీక్ష కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 3 నుంచి 15 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

Similar News

News December 13, 2025

2వ విడతలో 172 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు

image

సిద్దిపేట జిల్లాలో ఆదివారం జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 182 గ్రామ పంచాయతీలు ఉండగా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 172గ్రామ పంచాయతీలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. పోలింగ్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు Way2Newsను చూస్తూ ఉండండి.

News December 13, 2025

హనుమాన్ చాలీసా భావం – 37

image

జై జై జై హనుమాన గోసాయీ|
కృపా కరహు గురు దేవ కీ నాయీ||
గురువు మన అజ్ఞానాన్ని తొలగించి జీవితానికి సరైన మార్గం చూపిస్తారు. అలాగే హనుమంతుడు కూడా ఆ గురువులాగే దయ చూపి మనల్ని కష్టాల కడలి నుంచి తప్పిస్తాడు. ధైర్యాన్ని, సన్మార్గాన్ని ప్రసాదించి, నిరంతరం మనల్ని రక్షిస్తూ విజయం చేకూరేలా ఆశీర్వదిస్తాడు. ఈ శ్లోకం ద్వారా తులసీదాస్ హనుమకు జయం పలికి, ఆయన శక్తిని ప్రపంచానికి చాటి చెబుతున్నాడు. <<-se>>#HANUMANCHALISA<<>>

News December 13, 2025

ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

image

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.