News February 1, 2025
నరసరావుపేట: దూరవిద్య ఇంటర్ పరీక్షలు మార్చి 3న ప్రారంభం

దూరవిద్య ఇంటర్ పరీక్షలు మార్చి నుంచి ప్రారంభమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ శనివారం తెలిపారు. సైన్సు,ఆర్ట్స్ గ్రూపుల్లో అడ్మిషన్లు పొంది 2,387 మంది జిల్లాలో పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, వినకొండ పట్టణాల్లో మొత్తం 9 పరీక్ష కేంద్రాలను అన్ని మౌలిక వసతులతో సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 3 నుంచి 15 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.
Similar News
News November 22, 2025
HYD: Ibomma రవిని విచారించిన సీపీ

Ibomma రవి కేసులో మూడోరోజు కస్టడీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన సైబర్ క్రైమ్ ఆఫీసుకు వెళ్లి రవిని విచారించారు. పైరసీ నెట్ వర్క్, బెట్టింగ్ యాప్లతో అతనికున్న సంబంధాలు, విదేశీ కార్యకలాపాల గురించి సీపీ ఆరా తీసినట్లు సమాచారం.
News November 22, 2025
రోజూ 30 నిమిషాలు నడిస్తే..!

రోజూ 30 నిమిషాలు నడవడం అత్యంత శక్తివంతమైన ఔషధమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. దీనికి ఖర్చంటూ ఉండదని, దుష్ప్రభావాలు కూడా లేవని సూచించారు. ప్రతిరోజు అరగంట నడిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, డిప్రెషన్, డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని తెలిపారు. ఇది మెరుగైన నిద్ర, ఉల్లాసకరమైన మూడ్ను ఇస్తుందని సూచించారు. SHARE IT
News November 22, 2025
ADB: ఈ నెల 24న జిల్లాకు మంత్రి జూపల్లి రాక

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ఈ నెల 24న పర్యటించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. హైదరాబాద్ నుంచి సోమవారం ఉదయం రోడ్డు మార్గాన జిల్లాకు చేరుకొని ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభంతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోథ్ నియోజకవర్గంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అక్కడి నుండి నిర్మల్ జిల్లాకు వెళతారు.


