News February 10, 2025

నరసరావుపేట: నేడు కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ రద్దు

image

పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News December 7, 2025

విద్యార్థి ఇంటి ముందు ఉపాధ్యాయుల ధర్నా

image

TG: విద్యార్థి స్కూలుకు రాలేదని టీచర్లు ధర్నా చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. దుమ్ముగూడెం మండలం నిమ్మలగూడెంలో నాలుగో తరగతి స్టూడెంట్ వారం నుంచి స్కూలుకు రావట్లేదు. పేరెంట్స్‌ని అడిగితే సమాధానం లేదు. దాంతో ఆ ప్రాథమిక పాఠశాల టీచర్లు మిగిలిన విద్యార్థులతో కలిసి ఆ పిల్లాడి ఇంటి ముందు బైఠాయించారు. సోమవారం నుంచి పిల్లాడిని బడికి పంపుతామని పేరెంట్స్ హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

News December 7, 2025

నేడు కడప జిల్లాకు తెలంగాణ డిప్యూటీ CM.!

image

తెలంగాణ డిప్యూటీ CM బట్టి విక్రమార్కతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పోట్లదుర్తికి రానున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నాయుడు ఇటీవలే మాతృవియోగం అవడంతో ఆయనను పరామర్శించేందుకు హైదరాబాదు నుంచి వారు పొట్లదుర్తి చెరుకుని అనంతరం అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.

News December 7, 2025

NKD: సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు

image

ఖేడ్ మండలంలో సర్పంచ్ రేసులో నానమ్మ, మనువడు నిలిచారు. పీర్ల తాండకు చెందిన సాలిబాయి, ఆమె మనువడు సచిన్‌ నామినేషన్ వేశారు. ఇరువురి నామినేషన్లు సక్రమంగానే ఉండగా ఈనెల 9న సచిన్ నామినేషన్ విత్ డ్రా చేసుకోనున్నారు. దీంతో సాలిబాయి ఏకగ్రీవం కానున్నారు. 8 వార్డుల్లోనూ ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో జీపీ పాలకవర్గం ఏకగ్రీవం అయినట్టే. ఈమె భర్త జీవులనాయక్ 1987లో ఖేడ్ ప్రథమ MPP అయ్యారు. ఈయన సర్పంచ్‌గానూ పనిచేశారు.