News February 10, 2025
నరసరావుపేట: నేడు కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ రద్దు

పల్నాడు జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం- పిజిఆర్ఎస్) రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News December 13, 2025
టమాటాలో బొడ్డు కుళ్లు/ పూత వైపు కుళ్లు నివారణకు సూచనలు

టమాటా అభివృద్ధి చెందే దశలో నీటి ఎద్దడి, మొక్కల్లో కాల్షియం లోపం వల్ల బొడ్డు కుళ్లు కనిపిస్తుంది. నత్రజని, నేలలో కరిగే పోటాషియం, మెగ్నిషియం ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది. దీని నివారణకు నేలలో తేమ హెచ్చుతగ్గులు కాకుండా చూసుకోవాలి. భూమిలో తగినంత కాల్షియం ఉండేట్లు చూసుకోవాలి. పైరు కోత దశలో కాల్షియం నైట్రేట్ 7.5-10 గ్రాములు లేదా కాల్షియం క్లోరైడ్ 4 గ్రాములను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
News December 13, 2025
కోల్కతాలో ఉద్రిక్తత.. HYDలో పోలీసుల అలర్ట్

మెస్సీ టూర్ సందర్భంగా కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో HYDలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు. ఫ్యాన్స్ గ్రౌండ్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇవాళ సాయంత్రం ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అటు సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానులు టెంట్లు, ఫ్లెక్సీలు, కుర్చీలను <<18551215>>ధ్వంసం చేశారు<<>>. పోలీసులు వారిని చెదరగొట్టారు.
News December 13, 2025
తిరుమలలో పరకామణి మీకు తెలుసా?

తిరుమలలో భక్తులు హుండీలో సమర్పించే మొక్కుబడులు, కానుకలను లెక్కించే ప్రదేశమే ‘పరకామణి’. పూర్వం ఇది శ్రీవారి ఆలయం లోపల, ఆనంద నిలయం వెనుక ఉండేది. ప్రస్తుతం భద్రత, సాంకేతిక పరిజ్ఞానంతో, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం ఎదురుగా పరకామణి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలాది మంది భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల కానుకల లెక్కింపు నిరంతరం జరుగుతూ ఉంటుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>


