News February 7, 2025

నరసరావుపేట: పి-4 పాలసీ అమలు పై వీడియో కాన్ఫరెన్స్

image

ప్రభుత్వ ప్రయివేట్, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి ఇంటినీ ప్రగతి పథంలో నడిపించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పి-4 పాలసీని అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి పి-4 ప్రణాళికపై రాష్ట్రప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 26, 2025

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి

image

TG: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని పంపించనున్నారు. ఈ మేరకు కాకినాడ పోర్టుకు రైస్ చేరింది. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి నౌక ప్రయాణాన్ని ప్రారంభించనున్నట్లు సమాచారం. కొద్ది నెలల క్రితం ఆ దేశ ప్రతినిధులతో రైస్ ఎగుమతికి ఒప్పందం జరిగింది. 8లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News March 26, 2025

పార పట్టి కూలీలతో పని చేసిన భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ మంగళవారం టేకులపల్లి మండలం బోడు గ్రామపంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతు సమ్మయ్య పొలంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో కలిసి పారా, పలుగు పట్టి కొద్దిసేపు పని చేశారు. అనంతరం కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం 100 రోజులు పనిని పూర్తి చేసుకోవాలని సూచించారు. రోజువారి వేతనం 300 రూపాయలు లభించేలా పనిచేయాలని సూచించారు.

News March 26, 2025

BREAKING: మాజీ సీఎం ఇంటిపై సీబీఐ రైడ్స్

image

లిక్కర్ స్కాం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ ఇంట్లో CBI అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి రాయ్‌పూర్, బిలాయ్‌లోని ఆయన ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కాగా ఈనెల 10న బఘేల్ ఇంటిపై ED రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో అధికారుల వాహనాలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు కేంద్రం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బఘేల్ ఆరోపించారు.

error: Content is protected !!