News August 14, 2024
నరసరావుపేట: ‘ప్రతి ఇంట మువ్వన్నెల జెండా ఎగురవేయాలి’

దేశభక్తిని సమైక్యతను చాటి చెప్పెలా ప్రతి ఇంటిపైన మువ్వన్నెల జెండా ఎగరవేయాలని కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన కలెక్టరేట్లో మాట్లాడుతూ ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలోని పాఠశాలలో జాతీయ సమైక్యతపై పోటీలు నిర్వహించాలన్నారు. అనంతరం ప్రతి మండల కేంద్రం, జిల్లాలోనున్న ఇంజినీరింగ్ కళాశాలలో హర్ ఘర్ తిరంగా నిర్వహించాలన్నారు. సెల్ఫీ తీసుకున్న ఫోటోలు వెబ్సైట్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.
Similar News
News November 27, 2025
దుగ్గిరాల యార్డులో క్వింటాల్ పసుపు ఎంతంటే.!

దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం నిర్వహించిన వేలంలో పసుపు ధరలు నిలకడగా ఉన్నాయి. క్వింటాల్ పసుపు గరిష్ఠంగా రూ. 12,700 ధర పలికింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపు కొమ్ముల ధర రూ. 9 వేల నుంచి రూ. 12,700 వరకు, కాయ రకం పసుపు ధర రూ. 9,300 నుంచి రూ. 12,190 వరకు పలికాయి. మార్కెట్లో మొత్తం మీద పసుపు ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.
News November 27, 2025
అమరావతి రైతులు ఆందోళన వద్దు: పెమ్మసాని

రాజధాని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. త్రీ మ్యాన్ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. అమరావతి సమస్యలకు పరిష్కారం చూపుతూనే, రాజధాని పనులు వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. రాబోయే 6 నెలల్లో రాజధానికి అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తిచేసే దిశగా పటిష్ఠ చర్యలు తీసుకుంటామన్నారు. మరో 4 రోజుల్లో జరగబోయే 2వ సమావేశంలో రైతులకు పూర్తి వివరాలు చెప్తామన్నారు.
News November 27, 2025
విద్య వైద్యం ఇవ్వండి.. ఉచిత పథకాలు వద్దు: వెంకయ్య నాయుడు

తెనాలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఉచిత పథకాలతో ప్రజలను సోమరి పోతులుగా తయారు చేస్తున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం ఉచితంగా ఇస్తే చాలని, బస్సులు ఫ్రీగా ఇమ్మని ఎవరు అడిగారని ప్రశ్నించారు. సంపద సృష్టించాలి తప్ప అప్పులు చేయడం తప్పు అని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగులోనే పరిపాలన చేయాలని ముఖ్యమంత్రులను కోరారు.


