News February 1, 2025
నరసరావుపేట: ప్రభుత్వ ఆసుపత్రికి పరికరాల కొనుగోళ్లకు ఒప్పందం

పల్నాడు జిల్లాలోని మాచర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు 16 కీలక వైద్య పరికరాలను రూ.72.98 లక్షల నిధులతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పవర్ గ్రిడ్ సాదరన్ ఇంటర్ కనెక్టర్ ట్రాన్స్మీషన్ సిస్టం లిమిటెడ్ ఈ నిధులను చేకూరుస్తుంది. ఈ మేరకు కలెక్టర్ పి. అరుణ్ బాబు సమక్షంలో పీఎస్ఎల్ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు మధ్య ఎంఓయు జరిగింది. ఈ సంస్థ సహకారంతో వైద్య సేవలను గణనీయంగా మెరుగుపరచవచ్చన్నారు.
Similar News
News November 26, 2025
ఏలూరులో మెడికో ఆత్మహత్యాయత్నం

తన సోదరి అనారోగ్య కారణాలతో బాధపడుతుండడంతో మనస్తాపం చెందిన ఏలూరు మెడికల్ కాలేజీ విద్యార్థి అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (M) కోనాయపాలెంకు చెందిన జగదీష్ ప్రస్తుతం వైద్య విద్య 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఉత్తమ విద్యార్థిగా ప్రతిభ కనబరుస్తున్న అతను బుధవారం ఈ ఘటనకు పాల్పడ్డాడు. వైద్యులు అతనికి వైద్యం అందించగా ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.
News November 26, 2025
ఏలూరులో మెడికో ఆత్మహత్యాయత్నం

తన సోదరి అనారోగ్య కారణాలతో బాధపడుతుండడంతో మనస్తాపం చెందిన ఏలూరు మెడికల్ కాలేజీ విద్యార్థి అధిక మోతాదులో మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (M) కోనాయపాలెంకు చెందిన జగదీష్ ప్రస్తుతం వైద్య విద్య 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఉత్తమ విద్యార్థిగా ప్రతిభ కనబరుస్తున్న అతను బుధవారం ఈ ఘటనకు పాల్పడ్డాడు. వైద్యులు అతనికి వైద్యం అందించగా ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉంది.
News November 26, 2025
సిరిసిల్ల: ‘టీఆర్పీ అభ్యర్థులను గెలిపించండి’

రానున్న సర్పంచ్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుర్ర మల్లేశం గౌడ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో టీఆర్పీ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించి, ఆయన మాట్లాడారు. ప్రతి గ్రామంలో పార్టీని బలపరుస్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. పలువురు నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


