News February 1, 2025
నరసరావుపేట: ప్రభుత్వ ఆసుపత్రికి పరికరాల కొనుగోళ్లకు ఒప్పందం

పల్నాడు జిల్లాలోని మాచర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు 16 కీలక వైద్య పరికరాలను రూ.72.98 లక్షల నిధులతో ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. పవర్ గ్రిడ్ సాదరన్ ఇంటర్ కనెక్టర్ ట్రాన్స్మీషన్ సిస్టం లిమిటెడ్ ఈ నిధులను చేకూరుస్తుంది. ఈ మేరకు కలెక్టర్ పి. అరుణ్ బాబు సమక్షంలో పీఎస్ఎల్ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు మధ్య ఎంఓయు జరిగింది. ఈ సంస్థ సహకారంతో వైద్య సేవలను గణనీయంగా మెరుగుపరచవచ్చన్నారు.
Similar News
News November 24, 2025
WGL: జల వనరుల సర్వేలు: సీపీవోలే కన్వీనర్లు

వరంగల్లో జల వనరుల గణనలో భాగంగా, గ్రామాల్లోని చెరువుల నుంచి చిన్న చేదబావుల వరకు ప్రతీ నీటి వనరును సర్వే సిబ్బంది క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. ప్రతి వనరుకు ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ సర్వేకు సీపీవోలు కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు. నీటి నిర్వహణ, సంరక్షణ, భవిష్యత్ ప్రణాళికలకు అవసరమైన సమగ్ర డేటాబేస్ను సిద్ధం చేయడమే ఈ గణన ప్రధాన లక్ష్యం.
News November 24, 2025
నల్గొండ జిల్లాలో బీసీలకు తగ్గిన స్థానాలు

నల్గొండ జిల్లాలో రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే భారీ ఎత్తున బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడంపై బీసీల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఆదివారం ఆర్డీఓల ఆధ్వర్యంలో డివిజన్ల వారీగా సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 869 జీపీలు ఉండగా.. ఇందులో బీసీలకు 140 (2019లో 164) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
News November 24, 2025
పోచంపల్లి : బైక్ పైనుంచి పడి యువకుడు మృతి

భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మున్సిపల్ కేంద్రానికి చెందిన పొట్టబత్తిని సాయి కుమార్ (25) ఆదివారం రాత్రి ఫంక్షన్ నుంచి వస్తుండగా కుక్క అడ్డు రావడంతో బైక్పై నుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో సాయి కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. చిన్న వయసులోనే మృతి చెందడంతో కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.


