News March 18, 2025
నరసరావుపేట: బాలలకు ఆధార్ నమోదు చేపట్టాలి

జిల్లాలోని బాలలకు ఆధార్ నమోదు కార్యక్రమం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అరుణబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మార్చి నెలలో రెండు దఫాలుగా ఆధార్ క్యాంపులు చేపట్టాలని అధికారులకు సూచించారు. 19-22 వరకూ, 25-28 వరకూ మొత్తం 8 రోజుల పాటూ పాటు క్యాంపులు ఈ క్యాంపుల ద్వారా జిల్లాలో 20వేల మంది బాలలకు ఆధర్ ఆధార్ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు.
Similar News
News December 20, 2025
SRCL: ‘ఫర్టిలైజర్ యాప్పై అవగాహన కల్పించాలి’

రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్పై విస్తృత అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఫర్టిలైజర్ యాప్పై అవగాహన, ఆయిల్ పామ్ లక్ష్యం తదితర అంశాలపై జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓలతో సమీక్ష సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు.
News December 20, 2025
ALERT: ఈ వేరుశనగలు తింటే లివర్ క్యాన్సర్!

బూజు పట్టిన వేరుశనగలు తినడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిలో ఉండే అఫ్లాటాక్సిన్ B1 అనే విషపూరిత రసాయనం కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. ఇది శరీరంలోకి చేరితే తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్కు దారితీయడమే కాకుండా, DNAను మార్పు చేసి భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఆహార నిల్వ విషయంలో అప్రమత్తంగా ఉంటూ రంగు మారిన, బూజు పట్టిన గింజలను పారేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT
News December 20, 2025
అలాంటి చోట వాస్తు ప్రభావం ఉండదా ?

వేయి గడపలున్న చోట వాస్తు ప్రభావం ఉండదనుకోవడం భ్రమేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘తుపానులు, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలన్నీ సాంకేతిక, భౌగోళిక అంశాలు. వాటి వల్ల జరిగే నష్టాలను వాస్తుతో ముడిపెట్టకూడదు. చుట్టూ ఎన్ని ఇళ్లు ఉన్నా మన ఇంటి వాస్తు మనకు ముఖ్యం. వాస్తు అనుసరిస్తూనే, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా ఇంటి నిర్మాణం ఉండాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


