News April 4, 2025
నరసరావుపేట: మూల్యాంకన ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

కలెక్టర్ అరుణ్ బాబు స్థానిక శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. పరీక్ష పత్రాలను భద్రపరిచిన గదిని పరిశీలించి ఎంత శాతం మూల్యాంకన జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లను పరిశీలించి మూల్యాంకన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మూల్యాంకన ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలన్నారు.
Similar News
News January 7, 2026
సోమిరెడ్డి అవినీతి రూ.100కోట్లు: కాకాణి

సోమిరెడ్డి నీతిమాలిన మాటలు విని భవిష్యత్తులో ఉద్యోగులు ఇబ్బంది పడొద్దని మాజీ మంత్రి కాకాణి సూచించారు. ‘సోమిరెడ్డి చెప్పారనే వెంకటాచలం సర్పంచ్ను డీపీవో శ్రీధర్ రెడ్డి తొలగించారు. పోలీసులు లేకుండా MLA గ్రామాల్లోకి వెళ్తే ప్రజలు కుక్కను కొట్టినట్లు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్క ఇరిగేషన్ శాఖలోనే సోమిరెడ్డి రూ.100కోట్ల అవినీతి చేశారు’ అని కాకాణి ఆరోపించారు.
News January 7, 2026
గొర్రెలు, మేకలకు ‘పాక్స్’ టీకాలు: జిల్లా పశువైద్యాధికారి

ఈ నెల 8 నుంచి 22 వరకు నల్లగొండ జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు పాక్స్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్లు జిల్లా పశువైద్యాధికారి డా.జి.వి.రమేష్ తెలిపారు. వైరస్ వల్ల సోకే ఈ అంటువ్యాధి నివారణకు 78 బృందాలు గ్రామాల్లో పర్యటించనున్నాయి. జ్వరం, చర్మంపై బొబ్బలు ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. పెంపకందారులు మూడు నెలలు పైబడిన మూగజీవాలకు టీకాలు వేయించి, ప్రాణనష్టం కలగకుండా జాగ్రత్త వహించాలని ఆయన కోరారు.
News January 7, 2026
పెద్దపల్లి: ‘మధ్యవర్తిత్వంతోనే సత్వర న్యాయం’

న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించేందుకు ‘మధ్యవర్తిత్వం’ ఒక గొప్ప ప్రత్యామ్నాయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లా కోర్టు భవనంలో ‘మధ్యవర్తిత్వం-మిడియేటర్’ అంశంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. మధ్యవర్తిత్వం ద్వారా సమయం, ధనం ఆదా అవ్వడమే కాకుండా ఉభయ పక్షాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో పరిష్కారం లభిస్తుందని వివరించారు.


