News April 4, 2025

నరసరావుపేట: మూల్యాంకన ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

image

కలెక్టర్ అరుణ్ బాబు స్థానిక శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. పరీక్ష పత్రాలను భద్రపరిచిన గదిని పరిశీలించి ఎంత శాతం మూల్యాంకన జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లను పరిశీలించి మూల్యాంకన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మూల్యాంకన ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలన్నారు. 

Similar News

News April 19, 2025

ఈనెల 24తో ముగియనున్న AU EET దరఖాస్తు గడువు

image

సెల్ఫ్ సపోర్ట్ విధానంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే AU EET-2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు ఈనెల 24తో ముగియనుంది. ప్రవేశ పరీక్షను మే 5వ తేదీన నిర్వహిస్తారు. ఇంటర్ విద్యార్హత కలిగిన విద్యార్థులు సత్వరం దరఖాస్తు చేసుకోండి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతుంది. పూర్తి వివరాలకు ఏయూ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

News April 19, 2025

నేటి నుంచి 10 రోజులు..

image

తెలంగాణలో రాబోయే పది రోజులు ఎండలు మండిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 30 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతాయని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో 40-42 డిగ్రీల టెంపరేచర్ రికార్డయ్యే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో అకాల వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

News April 19, 2025

కోడూరు: తాబేలు పిల్లలను విడిచిపెట్టిన జాయింట్ కలెక్టర్

image

అరుదైన ఆలివ్‌ రిడ్లీ తాబేలు పిల్లలను కృష్ణాజిల్లా కలెక్టర్ గీతాంజలి శర్మ సాగరంలోకి వదిలిపెట్టారు. శనివారం కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ కుటుంబ సమేతంగా హంసలదీవి శివారు పాలకాయతిప్ప బీచ్ వద్ద అటవీ శాఖ వారి సంరక్షణలో ఉన్న గుడ్ల సేకరణ,సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. కృత్రిమంగా విధానంలో పొడిగించిన తాబేళ్ల పిల్లలను గీతాంజలి శర్మ సముద్రంలోకి విడిచిపెట్టారు.

error: Content is protected !!