News April 4, 2025

నరసరావుపేట: మూల్యాంకన ప్రక్రియ పరిశీలించిన కలెక్టర్

image

కలెక్టర్ అరుణ్ బాబు స్థానిక శ్రీమతి కాసు రాఘవమ్మ బ్రహ్మానంద రెడ్డి కళాశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. పరీక్ష పత్రాలను భద్రపరిచిన గదిని పరిశీలించి ఎంత శాతం మూల్యాంకన జరిగిందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లను పరిశీలించి మూల్యాంకన సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మూల్యాంకన ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలన్నారు. 

Similar News

News April 21, 2025

MNCL జిల్లాలో విషాదం.. యువరైతు ఆత్మహత్య

image

పంట దిగుబడి వస్తుందో.. రాదోనని కలత చెంది రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జైపూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీధర్ కథనం ప్రకారం.. పౌనుర్‌కు చెందిన యువ రైతు కుమార్(29)తన ఎకరం పొలంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మేలు ఫిమేల్ సీడ్ వరి వేశాడు. బోరు ఎండి నీరు అందక ఆవేదన చెందాడు. 3 ఏళ్లుగా పంట సాగులో నష్టాలను చవిచూస్తున్న కుమార్ ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

News April 21, 2025

ఒకేసారి APPSC, DSC పరీక్షలు.. అభ్యర్థుల్లో ఆందోళన

image

AP: మెగా డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు జరగనుండగా అదే సమయంలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. దీంతో రెండింటికీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 16 నుంచి 26 వరకు పాలిటెక్నిక్, జూ.లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల భర్తీకి పరీక్షలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఆయా తేదీల్లో మార్పు చేయాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు.

News April 21, 2025

ASF: తల్లి, భార్య మందలించిందని సూసైడ్

image

మద్యం తాగొద్దని తల్లి, భార్య మందలించడంతో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై ప్రశాంత్ కథనం ప్రకారం.. ఇందాని గ్రామానికి చెందిన లచ్చుంబాయి చిన్న కుమారుడు సంతోశ్ మద్యానికి బానిసయ్యాడు. తల్లి, భార్య కల్పన మందలించడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!