News February 1, 2025
నరసరావుపేట: యువతిని బెదిరించి రూ. 11 లక్షలు స్వాహా

నరసరావుపేటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సాయిసత్య శ్రీ అనే యువతిని ఆన్లైన్లో బెదిరించి రూ. 11 లక్షలు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. టూ టౌన్ సీఐ హైమారావు బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొరియర్లో తనకు గంజాయి వచ్చిందని, తనను అరెస్టు చేయటానికి స్పెషల్ పోలీసులు వస్తున్నారని ఫోన్ కాల్ వచ్చిందని వివరించారు. 2వ రోజే తన అకౌంట్లో రూ. 11లక్షలు కనిపించలేదన్నారు.
Similar News
News November 9, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారి 65పై చేర్యాల గేటు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణఖేడ్కు చెందిన బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News November 9, 2025
ములుగు: బాలుడి మృతిపై వైద్యశాఖ సీరియస్..!

ములుగు(D) కన్నాయిగూడెం(M) గూరేవులకు చెందిన హరినాథ్ స్వామి(7) అనే <<18238426>>బాలుడు పాముకాటుతో<<>> శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చిన బాలుడికి యాంటీడోస్ ఎందుకు ఇవ్వలేదనేదానిపై సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా లేకపోవడంపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.
News November 9, 2025
రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం

కొలిమిగుండ్ల(M) కల్వటాల సమీపంలోని రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో డ్రైవర్ గురు ప్రసాద్ మృతి చెందినట్లు కొలిమిగుండ్ల సీఐ రమేశ్ బాబు వెల్లడించారు. సిమెంటు లోడు చేసుకొని పైకప్పు బిగిస్తుండగా ట్యాంకర్ నుంచి జారి కిందపడి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. మృతుడు ఉయ్యాలవాడ మండలం అల్లూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సీఐ రమేష్ బాబు పేర్కొన్నారు.


