News April 9, 2025
నరసరావుపేట: వాల్ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్

పల్నాడు జిల్లాలో ఈనెల 8 నుంచి 22వ తేదీ వరకు 15 రోజుల పాటు 7వ పౌష్టికాహార పక్షోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ అరుణ్ బాబు గోడ పత్రికలు ఆవిష్కరించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఈ కార్యక్రమం జరిగింది. డీఈఓ చంద్రకళ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 25, 2026
SBIలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే లాస్ట్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మార్చిలో ఆన్లైన్ టెస్టు జరగనుంది. మొత్తం 2,050 పోస్టులు ఉండగా ఏపీలో 97, తెలంగాణలో 80 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. వయసు 30 ఏళ్ల కంటే ఎక్కువగా, 21 ఏళ్ల కంటే తక్కువగా ఉండకూడదు. అప్లై చేసేందుకు ఇక్కడ <
News February 25, 2026
నిరుద్యోగులకు ALERT.. మార్చి 9 నుంచి అగ్నివీర్ ర్యాలీ

AP, TGలకు చెందిన నిరుద్యోగులకు ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి ప్రారంభం కానుంది. గుంటూరులోని ANUలో ఫిజికల్ టెస్టులు ఉంటాయి. మార్చి 9, 10 తేదీల్లో మహిళలు, 12, 13 తేదీల్లో పురుషులు నేరుగా హాజరుకావొచ్చు. 2005 జులై 2-2009 జనవరి 2 మధ్య జన్మించిన, ఇంటర్/డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు. సర్టిఫికెట్ల జిరాక్స్లు, 10 ఫొటోలు తీసుకెళ్లాలి. రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
News February 25, 2026
ఇంటర్ పరీక్షల సందర్భంగా పకడ్బందీ బందోబస్తు: ఎస్పీ

ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బి.గితే తెలిపారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పరీక్షా సమయాల్లో పరీక్ష కేంద్రాల పరిసరాలలో 163 బీఎన్ఎస్ యాక్ట్ అమల్లో ఉందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచుతున్నామని వెల్లడించారు.


