News March 17, 2025
నరసరావుపేట: విద్యార్థుల కోసం అదనపు ఆర్టీసీ సర్వీసులు

పదవ తరగతి విద్యార్థుల కోసం అదనంగా పల్నాడు జిల్లాలో 70 ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్లు ప్రజా రవాణా అధికారి మధు తెలిపారు. చిలకలూరిపేట-13, సత్తెనపల్లి- 11,మాచర్ల- 4, పిడుగురాళ్ల -15 అదనంగా నడుపుతున్నామన్నారు. పరీక్షా సమయానికి అనుకూలంగా బస్ సర్వీసులు ఉంటాయన్నారు. పూర్తిగా ఉచిత ప్రయాణానికి విద్యార్థులు తమ హాల్ టికెట్లను కండక్టర్కు చూపిస్తే సరిపోతుందని ఆర్టీసీ జిల్లా అధికారి మధు పేర్కొన్నారు.
Similar News
News November 28, 2025
తంగళ్లపల్లి: ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని చెక్పోస్టును సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గితే శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
News November 28, 2025
కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు

‘దిత్వా’ తుఫాన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. ‘నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. గడచిన 6hrsలో 4kms వేగంతో కదులుతూ పుదుచ్చేరికి 420kms, చెన్నైకి 520kms దూరంలో కేంద్రీకృతమైంది. ఎల్లుండి నైరుతి బంగాళాఖాతం ఉత్తర TN, పుదుచ్చేరి, ద.కోస్తా తీరాలకు చేరుకునే అవకాశముంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.
News November 28, 2025
పల్నాడు జిల్లాలో మున్సిపాలిటీలకు పుడా నిధులు

పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 2.60 కోట్లు నిధులు కేటాయించింది. నరసరావుపేట మున్సిపాలిటీకి రూ.25 లక్షలు, దాచేపల్లి రూ.25 లక్షలు, గురజాల రూ.25 లక్షలు, మాచర్ల రూ.45 లక్షలు, పిడుగురాళ్ల రూ.50 లక్షలు, వినుకొండ రూ.40 లక్షలు, చిలకలూరిపేటకు రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులను మున్సిపాలిటీలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి వినియోగించనున్నారు.


