News February 3, 2025

నరసరావుపేట: సోమవారం గ్రీవెన్స్ రద్దు చేసిన జిల్లా ఎస్పీ

image

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వివరాలు తెలిపారు. గుంటూరు- కృష్ణా నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యధావిధిగా గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు.

Similar News

News January 25, 2026

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

image

వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి ఆదివారం రథసప్తమి సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేశారు. అర్చకులు తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి పంచామృతాలతో విశేషమైన అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్నారు.

News January 25, 2026

బడ్జెట్ సమావేశాల్లో జమిలి, అమరావతి బిల్లులు!

image

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ‘జమిలి ఎన్నికల’ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే JPC నివేదిక సిద్ధమైంది. అమరావతిని AP రాజధానిగా చట్టబద్ధం చేసే బిల్లుతో పాటు, ‘పూర్వోదయ’ పథకం కింద రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను సరళీకరణ, వక్ఫ్ బోర్డు సవరణలు, ‘వికసిత్‌ భారత్‌ శిక్షా అధీక్షణ్‌ బిల్లు’ కూడా ఈ సమావేశాల్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది.

News January 25, 2026

‘అనకాపల్లి జిల్లాలో రూ.37 కోట్లతో అభివృద్ధి పనులు’

image

అనకాపల్లి జిల్లాలో రూ.37 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు జిల్లా పరిషత్ సీఈవో నారాయణమూర్తి తెలిపారు. శనివారం మునగపాక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 2025-26 సంవత్సరంలో జిల్లాలో 24 మండలాలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.37.66 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. ఇప్పటివరకు అభివృద్ధి పనులకు రూ.33.48 కోట్లు ఖర్చు చేశామన్నారు.