News March 15, 2025

నరసరావుపేట: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞ

image

స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరి సహకారంతోనే స్వచ్ఛ పల్నాడు సాధ్యమవుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, డి.ఆర్.వో. మురళి, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News March 15, 2025

అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ దిబ్బడి, కె.ఎం.పాలెంలో అగ్నికి ఆహుతైన తోటలు
➤ జిల్లావ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమం 
➤ CMRF చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్
➤ చెత్త సంపద కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ విజయ కృష్ణన్
➤ ఖండివరం హైస్కూల్ HMకు షోకాజ్ నోటీసులు
➤ మాకవరపాలెంలో విద్యార్థులకు గ్రంధి వాపు పరీక్షలు 
➤ నేటితో ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు 
➤ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన మాడుగుల ఎమ్మెల్యే బండారు

News March 15, 2025

VZM: ‘ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి’

image

విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై కొన్ని మార్గదర్శకాలను ఆయన అందజేశారు. మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వానికి రావలసిన రెగ్యులర్ రిటర్న్, బకాయి పన్నుల వసూలు చేయాలన్నారు.

News March 15, 2025

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకున్నాం: మంత్రి ఉత్తమ్

image

TG: ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి (RLIP) కేంద్రం పర్యావరణ అనుమతులు నిరాకరించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇది తమ సర్కారు సాధించిన విజయమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి RLIP నిర్మాణం చేపట్టిందని కేంద్రం వద్ద తాను వాదనలు వినిపించానని చెప్పారు. దీన్ని అడ్డుకోకుండా ఉండి ఉంటే కృష్ణా పరివాహకంలో దుర్భర పరిస్థితి ఏర్పడేదన్నారు.

error: Content is protected !!