News March 15, 2025
నరసరావుపేట: స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞ

స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతిజ్ఞను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అందరి సహకారంతోనే స్వచ్ఛ పల్నాడు సాధ్యమవుతుందన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే, డి.ఆర్.వో. మురళి, కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2026
తిరుపతి: లడ్డూ వివాదం.. నేడు ఏం జరగనుందో.?

తిరుమల కల్తీ నెయ్యి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించగా.. దీనిపై మాజీ MP సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసుపై ఇవాళ వాదనలు జరగనున్నాయి. ఇది వరకే ఈ అంశంపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు CBI సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. మళ్లీ AP ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడంతో సుప్రీం కోర్ట్లో ఏం జరగనుందో అన్న చర్చ నడుస్తోంది.
News February 23, 2026
చెర్వుగట్టు విరాళాల్లో భారీ గోల్మాల్

నల్గొండ జిల్లా చెర్వుగట్టు ఆలయ అన్నదాన విరాళాల్లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. గతేడాది DECలో ఓ భక్తుడు అందజేసిన రూ.5 వేలు విరాళానికి గాను సిబ్బంది కేవలం రూ.1,000 మాత్రమే రికార్డుల్లో చూపినట్లు భక్తులు ఆరోపించారు. అధికారుల మౌనంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులైన ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలని, పూర్తిస్థాయి విచారణ జరిపి ఆలయ పవిత్రతను కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
News February 23, 2026
భద్రాద్రి: రూ.80 కోట్లతో నవోదయ విద్యాలయం

అశ్వాపురం(M) భీముని గుండం కొత్తూరులో జవహర్ నవోదయ విద్యాలయ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. మొండికుంట పరిధిలోని 997 సర్వే నంబర్లోని 33 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అప్పగించింది. సుమారు రూ.80 కోట్లతో నిర్మాణ బాధ్యతను NBCCకి అప్పగించారు. ఇటీవల అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాన్ని పరిశీలించారు. దీని ద్వారా జిల్లా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన విద్య అందుబాటులోకి రానుంది.


