News January 25, 2025
నరసరావుపేట: హాస్టల్లో గర్భం దాల్చిన విద్యార్థిని

నరసరావుపేట పట్టణంలోని SC గర్ల్స్ హాస్టల్లో మాచర్ల నియోజకవర్గం దుర్గికి చెందిన ఓ విద్యార్థిని గర్భం దాల్చింది. దీంతో ఆ విద్యార్థిని శుక్రవారం రాత్రి గుంటూరు GGHకి తరలించారు. విద్యార్థిని పిడుగురాళ్లలోని నర్సింగ్ కాలేజీలో GNM మొదటి సంవత్సరం చదువుతోంది. గర్భం పోగొట్టేందుకు అధిక సంఖ్యలో మాత్రలు మింగడంతో అస్వస్థతకు గురైంది. రక్త స్రావం అధికమవడంతో సిబ్బంది హాస్పిటల్కు తరలించారు.
Similar News
News September 16, 2025
పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

పోషణ మాస వారోత్సవాలను సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు గ్రామసభలలో పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు.
News September 16, 2025
అమరావతి ఐకానిక్ వంతెన మోడల్ ఇదే

ఏపీలో ఐకానిక్ <<17619158>>వంతెన<<>> నమూనాను సీఎం చంద్రబాబు ఎంపిక చేశారు. 4 నమూనాలను వెబ్సైట్లో ఉంచగా అత్యధిక ఓటింగ్(14వేలకు పైగా ఓట్లు) వచ్చిన రెండో డిజైన్ను సెలక్ట్ చేశారు. రూ.2,500CR వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ వంతెన రాకతో హైదరాబాద్-అమరావతి మధ్య 35kmల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. ఈ నమూనాను కూచిపూడి నృత్యంలోని స్వస్తిక హస్త భంగిమ ఆధారంగా తీసుకున్నారు.
News September 16, 2025
KNR: SEPT 17న జాతీయ పతాకం ఆవిష్కరించేది వీరే..!

సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులను, ఛైర్మన్లను నియమించింది. JGTLలో BC కమిషన్ ఛైర్మన్ నిరంజన్, PDPLలో మైనారిటీస్ ఛైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, KNRలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, SRCLలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.