News March 17, 2025

నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

image

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News December 6, 2025

చిన్న చీమ పెద్ద మనసు.. చావడానికీ వెనుకాడదు!

image

కష్టం, క్రమశిక్షణకు మారుపేరైన చీమల గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. తీవ్రంగా జబ్బుపడిన చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికి సిద్ధమవుతాయని ఆస్ట్రియా పరిశోధకుల స్టడీలో తేలింది. అనారోగ్యానికి గురైనవి రసాయన వాయువు రిలీజ్ చేసి ‘డేంజర్’, ‘నన్ను చంపండి’ అనే సిగ్నల్‌ ఇస్తాయని సైంటిస్టులు చెప్పారు. దీంతో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఆ చీమ గూడును ఇతర చీమలు చీల్చివేస్తాయని తెలిపారు.

News December 6, 2025

గద్వాల్: మూడో విడతలో 438 నామినేషన్లు

image

మూడో విడత నామినేషన్ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. అల్లంపూర్ సర్పంచ్ (90), వార్డు మెంబర్లకు (282), ఇటిక్యాల సర్పంచ్ (63), వార్డ్ మెంబర్లు(244), మానవపాడు సర్పంచ్ (87), వార్డు మెంబర్లు (320), ఎర్రవల్లి సర్పంచ్ (98), వార్డ్ మెంబర్లు (330), ఉండవెల్లి సర్పంచ్ (100), వార్డ్ మెంబర్లు (330) మొత్తం 438 సర్పంచ్, 1489 వార్డు మెంబర్ నామినేషన్లు దాఖలయ్యాయి.

News December 6, 2025

గ్రీవ్స్ డబుల్ సెంచరీ.. NZ-WI తొలి టెస్టు డ్రా

image

న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. 531 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 72కే 4 వికెట్లు పడినా జస్టిన్ గ్రీవ్స్(202*) అద్భుత పోరాటం చేశారు. షాయ్ హోప్(140), కీమర్ రోచ్‌(58*)తో కలిసి న్యూజిలాండ్‌కు చుక్కలు చూపెట్టారు. దాదాపు గెలిపించినంత పని చేశారు. కానీ 5వ రోజు కావడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్కోర్లు: ఫస్ట్ ఇన్నింగ్స్: NZ-231/10, WI-167/10, సెకండ్ ఇన్నింగ్స్: NZ-466/8D, 457/6.