News March 17, 2025

నరసరావుపేట: 10వ తరగతి విద్యార్థులకు డీఈవో సూచనలు

image

సోమవారం నుంచి పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరాలని డీఈవో చంద్రకళ సూచించారు. జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాలలో 26,497 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని తెలిపారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ శాఖ 144 సెక్షన్ అమలు చేస్తుందన్నారు. అత్యవసర సమయాలలో విద్యార్థులు 100 ఫోన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

Similar News

News November 11, 2025

TTDకి 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా

image

తిరుమలకు రూ.251.53 కోట్ల విలువైన 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని 2022-24 మధ్య భోలేబాబా డెయిరీ సరఫరా చేసినట్టు A16 అజయ్ కుమార్ సుగంధ్ రిమాండ్ రిపోర్ట్‌లో CBI SIT పొందుపరిచింది. ఇందులో రూ.137.22 కోట్ల విలువైన 37.38 లక్షల కిలోల కల్తీ నెయ్యిని శ్రీవైష్ణవి డెయిరీ ద్వారా తరలించారని సిట్ పేర్కొంది.

News November 11, 2025

తుళ్లూరు: కారుణ్య మరణం పిటిషన్‌పై హైకోర్టు సీరియస్

image

తమ భూమిని తిరిగి అప్పగించకలేకపోతే కారుణ్య మరణానికి అనుమతించాలని తుళ్ళూరు(M) రాయపూడికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ, ఆమె కుమార్తె, మనవరాలు పిటిషన్‌ వేయడంపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ తరహా అభ్యర్థనలు అనుమతించబోమని తెలుసు కదా అంటూ పిటిషనర్ తరపు న్యాయవాదిపై ఆగ్రహించింది. ప్రచారం కోసం కోర్టులను ఉపయోగించుకోవద్దంది. కాగా CRDAకు అప్పగించిన తమ 5 సెంట్ల భూమిని అప్పగించాలని వారు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు.

News November 11, 2025

ఏపీ అప్డేట్స్

image

☛ రబీలో ప్రధానమంత్రి పంట బీమా పథకం(PMFBY) అమలుకు రూ.44.06 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
☛ MBBS రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదల.. రీకౌంటింగ్‌కు ఈ నెల 17 వరకు అవకాశం
☛ కల్తీ నెయ్యి కేసులో YCP నేత వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ
☛ పింగళి వెంకయ్య, బ్రౌన్‌ల జయంతులను రాష్ట్ర పండగలుగా నిర్వహించాలని సీఎం చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లేఖ