News January 18, 2025

నరసాపురం టూ చర్లపల్లికి ఖాళీగా వెళ్లిన రైలు

image

సంక్రాంతి ప్రయాణీకులతో రద్దీగా ఉంటుందని శుక్రవారం నరసాపురం- చర్లపల్లికి ఏర్పాటు చేసిన రైలు కాళీగా దర్శనమిచ్చింది.దీంతో ఈనెల 19 నరసాపురం నుంచి చర్లపల్లికి మరో రైలు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ మధుబాబు చెప్పారు. ఈ రైలు నరసాపురంలో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు చర్లపల్లికి వెళ్తుందన్నారు. పాలకొల్లు, భీమవరం టౌన్, జంక్షన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా వెళ్తుంది.

Similar News

News February 12, 2025

యలమంచిలి : కళాశాల హాస్టల్లో విద్యార్థి సూసైడ్

image

ప.గో జిల్లా యలమంచిలికి చెందిన రావూరి సాయిరాం (22) కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల హాస్టల్లో సోమవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని స్వగ్రామం బాడవకు తీసుకొచ్చారు. అయితే అతని మృతికి కారణాలు తెలియలేదని కాకినాడ పోలీసులు తెలిపారు. మరి కొద్ది రోజుల్లో ప్రాక్టికల్స్ ఉండడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా.. వేరే కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో కాకినాడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 12, 2025

తణుకు: బర్డ్‌ ఫ్లూ ప్రభావిత ప్రాంతాలు ఇవే…!

image

బర్డ్‌ ఫ్లూ వైరస్‌ సోకిన తణుకు మండలం వేల్పూరులో కోళ్లఫారం నుంచి 10 కిలోమీటర్లు విస్తీర్ణంలో ఇన్‌ఫెక్టెడ్‌ ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు. తణుకు మండలంలోని తణుకుతోపాటు కొమరవరం, యర్రాయిచెరువు, మండపాక, తేతలి, ఇరగవరం మండలం ఇరగవరం, కావలిపురం, రేలంగి, అర్జునుడుపాలెం, అత్తిలి మండలంలో గుమ్మంపాడు, పాలి, బల్లిపాడు, పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామాలను ప్రకటించారు. చికెన్, గుడ్లు అమ్మకాలను నిలిపివేశారు.

News February 12, 2025

 ఓఎన్‌జీసి ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

image

దేశాభివృద్ధికి చమురు గ్యాస్ ఉత్పత్తులను వెలికి తీయడం ఎంత ముఖ్యమో, స్థానిక ప్రజల జీవన ప్రమాణాలకు ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవడం అంతే ముఖ్యమని కలెక్టర్ నాగరాణి ఓఎన్జీసి ప్రతినిధులకు సూచించారు. మంగళవారం నాగిడిపాలెం తుఫాను పునరావాస కేంద్రం ఖాళీ ప్రదేశంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

error: Content is protected !!