News December 13, 2024
నరసాపురం: ‘డిసెంబర్ 14న జాతీయ లోక్ అదాలత్’

ఉన్నత న్యాయ స్థానాల ఆదేశాల మేరకు డిసెంబర్ 14వ తేదీన నరసాపురం కోర్ట్ సముదాయాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి పి. విజయదుర్గ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆయా కోర్టులలో ఉన్న రాజీపడతగిన అన్ని క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, సివిల్ భూ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్ట పరిహార కేసులు మొదలగునవి రాజీ చేసుకోవచ్చన్నారు
Similar News
News November 12, 2025
దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం: కలెక్టర్ నాగరాణి

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. వారి ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు. భీమవరంలో గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ‘భవిత విలీన విద్య వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ, వైద్య నిర్ధారణ శిబిరాన్ని పరిశీలించారు.
News November 12, 2025
ఆకివీడు: డిప్యూటీ సీఎం చొరవతో నేడు గృహప్రవేశం

చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్న ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కంకణాల కృష్ణవేణి ఇళ్లు లేక ఇబ్బంది పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ను గత మూడు నెలల క్రితం మంగళగిరిలో ఆమె పవన్ను కలిసి తన గోడును విన్నవించుకుంది. పవన్ ఆదేశాలతో ఇంటి నిర్మాణంలో భాగంగా, నేడు కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా కృష్ణవేణి గృహప్రవేశం చేసింది. సొంతింటి కల నెరవేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
News November 12, 2025
తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.


