News February 23, 2025
నరసాపురం నుంచి బైకుపై కుంభమేళాకు..

144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు నరసాపురం వాసులు బైకుపై వెళ్లొచ్చామన్నారు. పట్టణానికి చెందిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు చామర్తి రవి కుమార్, నాగేంద్ర బైక్పై రోజుకు 500కిమీ చొప్పున 3 రోజులు ప్రయాణించి ప్రయాగ్రాజ్కు వెళ్లారు. పవిత్ర స్నానం తర్వాత 18న బయల్దేరి 21న నరసాపురం వచ్చారు. పెట్రోల్ బంకుల్లో టెంట్లలో బస చేస్తూ వెళ్లొచ్చినట్లు తెలిపారు.
Similar News
News October 23, 2025
జూబ్లీహిల్స్లో ప్రచారం.. ప్రతి పైసా లెక్క చెప్పాలి!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థులు ప్రచారం కోసం చేసే ప్రతి పైసాను లెక్కించి అభ్యర్థుల ఖాతాలో జమ చేయాలని వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్లను తనిఖీ చేశారు. అభ్యర్థుల పెయిడ్ న్యూస్పై నిఘా ఉంచాలన్నారు. ర్యాలీలు, సభలు, రోడ్ షోలను రికార్డింగ్ చేయాలన్నారు.
News October 23, 2025
NTR: అరుణాచలం వెళ్తున్నారా.. ఇది మీకోసమే

కార్తీక పౌర్ణమి గిరి ప్రదక్షిణ సందర్భంగా అరుణాచలం వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. నవంబర్ 3న విజయవాడ నుంచి రూ.2,500 ఛార్జీతో ప్రత్యేక బస్సు నడపనున్నట్లు ప్రకటించింది. ఈ ట్రిప్లో శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం కూడా కల్పిస్తారు. https://www.apsrtconline.in/ అధికారిక వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని సూచించింది.
News October 23, 2025
టెక్కలి: రూ. 5 కోట్లతో ఎండల మల్లన్న ఆలయాభివృద్ధి

ఎండల మల్లికార్జున స్వామి సమగ్ర ఆలయాభివృద్ధికి రూ. ఐదు కోట్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మండలంలోని రావివలస ఎండల మల్లిఖార్జున స్వామి ఆలయం వద్ద కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు, ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించి మాట్లాడారు. ఆలయ ప్రతిష్ఠను పెంపొందించే విధంగా ప్రత్యేక దృష్టి సారించామన్నారు.