News January 7, 2025

నరసాపురం: ఫసల్ భీమా యోజన గడువు పెంపు

image

ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం గడువు ఈనెల 15 వరకు ప్రభుత్వం పెంచినట్లు వ్యవసాయశాఖ ఏడీఈ డాక్టర్ అనిల్ కుమారి తెలిపారు. సబ్ డివిజన్ లోని యలమంచిలి, నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని రైతులు ఇంకా ఇన్యూరెన్స్ చెల్లించని పక్షంలో గడువులోపు చెల్లించుకోవాలన్నారు. దీని వల్ల పంటలు నష్టపోయినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బీమా పొందేందుకు వీలుంటుందన్నారు.

Similar News

News December 13, 2025

జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలపై సమీక్ష చేపట్టిన జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు.

News December 13, 2025

జాతీయ వినియోగదారుల దినోత్సవ సంబరాలపై సమీక్ష చేపట్టిన జేసీ

image

భీమవరం కలెక్టరేట్‌లో శుక్రవారం జాతీయ వినియోగదారుల దినోత్సవం సంబరాలు 2025 ఏర్పాట్లపై జిల్లా జాయింట్ కలెక్టర్ టీ రాహుల్ కుమార్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ..డిసెంబర్ 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో వినియోగదారుల హక్కులపై విస్తృత అవగాహన కల్పించే వారోత్సవాలు నిర్వహించాలని అన్నారు.

News December 12, 2025

సామాజిక చైతన్యానికి బాలోత్సవాలు: కలెక్టర్

image

బాలోత్సవాలు విద్యార్థుల్లో సామాజిక చైతన్యానికి సామాజిక ప్రగతికి ఎంతగానో దోహదపడతాయని కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం ఎస్ఆర్ కెఆర్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగే బాలోత్సవాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచి ఆటలు పాటలు ఉంటే చెడు మార్గం వైపు వెళ్లరని అన్నారు. ఎమ్మెల్సీ గోపీమూర్తి మాట్లాడుతూ..సమాజాన్ని పట్టిపీడిస్తున్న పలు రకాల వ్యసనాలతో విద్యార్థి యువత పెడదోవ పడుతున్నారని అన్నారు.