News March 15, 2025

నరసాపురం: వీర మహిళను సస్పెండ్ చేసిన జనసేన

image

మొగల్తూరు మండల రామన్నపాలెంకు చెందిన జనసేన వీరమహిళ పిప్పళ్ల సుప్రజ జనసేన ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసి సస్పెండ్ చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తెలిపారు. గడిచిన పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఆమె పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి ఎమ్మెల్సీగా పోటీ చేశారన్నారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో అధిష్ఠానం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 7, 2025

పనులు లేని వారందరికీ ఉపాధి కల్పించాలి: జడ్పీ ఛైర్మన్

image

ఉపాధి కింద పనులు లేని వారందరికీ ఉపాధి కల్పిస్తూ, రైతులకు ప్రయోజనకరమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి సూచించారు. శుక్రవారం కర్నూలులో జరిగిన ఉమ్మడి జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అవుకు రిజర్వాయర్లో 4 TMCల నీటి నిల్వ సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం 2.5 TMCలు మాత్రమే నిల్వ ఉన్నాయన్నారు. పెండింగ్ అండర్ కాంక్రీట్ పనులను పూర్తిచేసి, పూర్తి సామర్థ్యంతో నీటిని నింపాలన్నారు.

News November 7, 2025

ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించండి: ఎస్పీ

image

పోలీస్ అంటే భయం కాదు.. నమ్మకం కలిగించేలా సిబ్బంది పనిచేయాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లీ పోలీస్ అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణలో ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులను నిర్వహించి కఠిన చర్యలు చూసుకోవాలని సూచించారు.

News November 7, 2025

వరంగల్‌లో MRPS ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం

image

వరంగల్‌లో ఈరోజు ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల కార్యవర్గ ఉమ్మడి జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి ఎమ్మార్పీఎస్ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 11వ తేదీన నిర్వహించబోయే చలో ఢిల్లీ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని నేతలు కోరారు.