News March 15, 2025

నరసాపురం: వీర మహిళను సస్పెండ్ చేసిన జనసేన

image

మొగల్తూరు మండల రామన్నపాలెంకు చెందిన జనసేన వీరమహిళ పిప్పళ్ల సుప్రజ జనసేన ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసి సస్పెండ్ చేసినట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు తెలిపారు. గడిచిన పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఆమె పార్టీకి వ్యతిరేకంగా వెళ్లి ఎమ్మెల్సీగా పోటీ చేశారన్నారు. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించడంతో అధిష్ఠానం సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 5, 2025

జిల్లాలో 23,719 PMUY కనెక్షన్లు.. MP ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం

image

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన(PMUY) కింద ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో 9.71 లక్షల ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వబడినట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి లోక్ సభలో వెల్లడించారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ వివరాలను తెలియజేశారు. లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి ఈ గణాంకాలను అందించారు. ఈ గణాంకాల ప్రకారం, ఏలూరు జిల్లాలో 23,719 ఉచిత కనెక్షన్లు మంజూరు చేయబడ్డాయని వెల్లడించారు.

News December 5, 2025

జగిత్యాల: జిల్లా స్థాయి పీఎం శ్రీ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

image

జగిత్యాల జిల్లా స్థాయి పీఎం శ్రీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్‌ను వివేకానంద మినీ స్టేడియంలో అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత ప్రారంభించారు. జిల్లాలోని 16 పీఎం శ్రీ పాఠశాలలకు చెందిన 900 మంది విద్యార్థులు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీలలో పాల్గొన్నారు. ఆటలు విద్యార్థుల్లో ఆరోగ్యం, మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని లత తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాము, రాజేష్, చక్రధర్, విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

News December 5, 2025

సిరిసిల్ల: ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

image

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్లలో స్టాఫ్ నర్సులు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ MLHPలతో ఆమె శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నారు. సకాలంలో లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు.