News March 11, 2025
నరసారావుపేట మాజీ MLAపై కంప్లైంట్

నరసారావుపేట మాజీ MLA గోపిరెడ్డి, మాజీ MP విజయసాయి రెడ్డిపై మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, టీడీపీ కార్యకర్తలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారునిపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. అప్పట్లో శ్రీకాకుళం వాసి నాగరాజు తన వద్ద కోడెల రూ. 15 లక్షలు లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ MP, మాజీ MLA ఒత్తిడితోనే చేశానని ఒప్పుకున్నారు.
Similar News
News November 14, 2025
రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న ప్రశాంత్ కిశోర్.. జోరుగా చర్చ

బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ జన్ సురాజ్ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. 25 కంటే ఎక్కువ సీట్లను జేడీయూ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని పీకే శపథం చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం జేడీయూ 25 సీట్లను సునాయాసంగా గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ ఒత్తిడి చేయడం వల్లే ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేసిందని జన్ సురాజ్ నేత అనుకృతి పేర్కొన్నారు.
News November 14, 2025
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి..

బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఫలితాలను ఎన్డీయే నమోదు చేస్తోంది. ఎన్డీయే 130-160 సీట్ల వరకు సాధిస్తుందని మెజారిటీ సర్వే సంస్థలు చెప్పాయి. కానీ వాటన్నింటినీ తలకిందులు చేస్తూ అధికార కూటమి 190 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ప్రతిపక్ష మహాగఠ్బంధన్ 70-100 గెలుస్తుందన్న సర్వేల అంచనాలు నిజం కాలేదు. ఎంజీబీ కేవలం 50 లోపు సీట్లలోనే లీడ్లో ఉండటం గమనార్హం.
News November 14, 2025
ప్రారంభం కానున్న జెండర్ రిసోర్సు సెంటర్

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కోవూరు, గుడ్లూరు, వెంకటాచలం, పొదలకూరు, కావలి, కలిగిరి, ఆత్మకూరు, రాపూరు మండలాల్లో ఈ నెల 20లోగా జెండర్ రిసోర్సు సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. మహిళా ప్రతినిధులే ఈ కేంద్రాలను నిర్వహిస్తారు. లైంగిక–వరకట్న వేధింపులు, బాల్య వివాహాలు, హింస వంటి సమస్యలపై కౌన్సెలింగ్, న్యాయం, తక్షణ సాయం అందిస్తారు. ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షలు మంజూరు చేశారు.


