News March 11, 2025
నరసారావుపేట మాజీ MLAపై కంప్లైంట్

నరసారావుపేట మాజీ MLA గోపిరెడ్డి, మాజీ MP విజయసాయి రెడ్డిపై మాజీ కౌన్సిలర్ నాగజ్యోతి, టీడీపీ కార్యకర్తలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ స్పీకర్ కోడెల, అతని కుమారునిపై కేసులు పెట్టి వేధించారని పేర్కొన్నారు. అప్పట్లో శ్రీకాకుళం వాసి నాగరాజు తన వద్ద కోడెల రూ. 15 లక్షలు లంచం తీసుకున్నారని ఫిర్యాదు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మాజీ MP, మాజీ MLA ఒత్తిడితోనే చేశానని ఒప్పుకున్నారు.
Similar News
News December 3, 2025
డాలర్ విలువ పెరిగితే మనకు ఎలా భారం..?

డాలర్తో రూపాయి మారకం విలువ పతనం సామాన్యుడికి ఆర్థిక భారం. ఫారిన్ దిగుమతులకు డాలర్ రూపంలో డబ్బు చెల్లించాలి. దీంతో మనం ఎక్కువ పే చేయాలి. 90% క్రూడ్, కొన్ని వంట నూనెలు విదేశాల నుంచే వస్తాయి. సెమీ కండక్టర్స్, చిప్స్ లాంటి ఇంపోర్టెడ్ విడి భాగాలతో తయారయ్యే ఫోన్స్, ల్యాప్టాప్స్, రిఫ్రిజిరేటర్స్ ధరలు, ఫారిన్లో మన విద్యార్థులకు పంపాల్సిన ఫీజులు పెరుగుతాయి.
Ex: ఓ $1 వస్తువు.. మనకు గతంలో ₹80, నేడు ₹90.
News December 3, 2025
మహిళా అభివృద్ధి&శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు

TG: పెద్దపల్లి జిల్లాలోని మహిళా అభివృద్ధి& శిశు సంక్షేమశాఖలో 16 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PG, డిగ్రీ, LLB, ANM, GNM, MBBS, BAMS, BHMS, BSc(నర్సింగ్), డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్, సూపరింటెండెంట్, CWO, పారా మెడికల్ స్టాఫ్, నర్సు, ANM, సోషల్ వర్కర్ తదితర పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: peddapalli.telangana.gov.in/
News December 3, 2025
అమరావతిలో NGO టవర్స్.. 1,995 ఫ్లాట్లు రెడీ.!

అమరావతిలో నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ (NGO) టవర్స్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఏపీసీఆర్డీఏ పర్యవేక్షణలో మొత్తం 21 భారీ టవర్లను నిర్మిస్తున్నారు. స్టిల్ట్+12 అంతస్తులతో కూడిన ఈ ప్రాజెక్టులో ఏకంగా 1,995 ఆధునిక ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 35 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఉద్యోగులకు సౌకర్యవంతమైన, భవిష్యత్ అవసరాలకు తగ్గ నివాసాలు కల్పించడమే దీని లక్ష్యం.


