News March 18, 2025

నర్వలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

image

నర్వ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు, అధికారులకు మార్చ్ 21 నుంచి జరిగే పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలన్నారు.

Similar News

News December 16, 2025

SRHకు లివింగ్‌స్టోన్.. భారీ రేటు

image

ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ₹2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన అతడిని ₹13 కోట్లకు దక్కించుకుంది. రచిన్ రవీంద్రను ₹2 కోట్లకు, ఆకాశ్ దీప్‌ను ₹కోటికి KKR కొనుగోలు చేసింది. రాహుల్ చాహర్‌ను ₹5.2 కోట్లకు, మ్యాట్ హెన్రీని ₹2 కోట్లకు, సర్ఫరాజ్ ఖాన్‌ను ₹75 లక్షలకు చెన్నై సొంతం చేసుకుంది. జోష్ ఇంగ్లిస్‌ను ₹8.6 కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.

News December 16, 2025

ఆపరేషన్ సిందూర్‌ ఫస్ట్‌డేనే భారత్ ఓడింది: మహారాష్ట్ర Ex-CM

image

‘ఆపరేషన్ సిందూర్’లో మొదటిరోజే భారత్ ఓడిందని MH Ex-CM, కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అంగీకరించినా లేకున్నా భారత ఎయిర్ క్రాఫ్ట్‌లు మొదటిరోజు దాడి చేయలేదన్నారు. ‘గ్వాలియర్, బఠిండా, సిర్సా నుంచి ఎగిరే ఎయిర్‌క్రాఫ్ట్‌లను పాక్ కూల్చేసే ప్రమాదం ఉండడంతో దాడి చేయలేదు. భవిష్యత్తులోనూ వైమానిక, క్షిపణి యుద్ధాలే జరుగుతాయి. 12 లక్షల మంది సైనికులు అవసరమా?’ అని ప్రశ్నించారు.

News December 16, 2025

వాస్తుకు లేని ఇంట్లో ఉండవచ్చా?

image

ఇంటికి వాస్తు దోషాలున్నప్పటికీ కొన్ని సానుకూల జీవన విధానాలు, ఆధ్యాత్మిక అభ్యాసాల వల్ల కుటుంబం ఉన్నత స్థాయికి చేరగలదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. రోజూ ఉదయాన్నే లేవడం, యోగా, దైవ ప్రార్థన, పరిశుభ్రత, తులసి పూజ, ఉదయం, సాయంత్రం కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం, దీపం పెట్టడం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నింపుతాయి. ఫలితంగా వాస్తు దోషాలున్నా సానుకూల ఫలితాలు ఏర్పడుతాయి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>